West Bengal: బైపోల్లో టీఎంసీ విజయం.. రక్తపాతం సృష్టించి గెలిచారంటూ బీజేపీ విమర్శలు
- బైపోల్లో టీఎంసీ విజయం
- రక్తపాతం సృష్టించి గెలిచారంటూ బీజేపీ విమర్శలు
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్లో బైపోల్స్ జరిగాయి. గుజరాత్లో రెండు స్థానాల్లో ఒకటి బీజేపీ, ఇంకొకటి ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఇక కేరళలో కాంగ్రెస్ గెలిచింది. పశ్చిమ బెంగాల్లోని కలిగంజ్ సీటును అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ సందర్భంగా కలిగంజ్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: GHMC: లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
అయితే బైపోల్లో టీఎంసీ విజయంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ యూనిట్ సహ-ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. రక్తం చిందించకుండా టీఎంసీ ఉప ఎన్నికలో కూడా గెలవదంటూ ట్వీట్ చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో బాంబు పేలుడికి పదేళ్ల బాలిక మరణించిందని.. టీఎంసీ వేడుకలు రక్తంతో ముగుస్తాయని మాల్వియా ట్వీట్లో పేర్కొన్నారు. 4వ తరగతి విద్యార్థిని తమన్నా ఖాతున్ అనే చిన్న అమ్మాయి చనిపోయిందని తెలిపారు. టీఎంసీ అసలు రాజకీయ పార్టీ కాదని.. అది రాబందుల ముఠాగా అభివర్ణించారు. రక్తం చిందించకుండా గెలవలేదని తెలిపారు. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా ఉప ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్లో ఇదే పరిస్థితా? మమతా బెనర్జీ పాలనలో విజయానికి చెల్లించే ధర ఇదేనా? అంటూ మాల్వియా విమర్శించారు.
ఇది కూడా చదవండి: YS Jagan: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..? చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్..
ఇక బాలిక మరణం పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా విచారం వ్యక్తం చేశారు. తీవ్ర విచారానికి గురైనట్లు పేర్కొన్నారు. దు:ఖ సమయంలో మా ప్రార్థనలు, ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయని పేర్కొన్నారు.
కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్యదాన్ షౌకత్ను ప్రియాంక అభినందించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) దార్శనికతపై నమ్మకం ఉంచినందుకు నిలంబూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతుతో ఆర్యదాన్ షౌకత్… పార్టీని ముందుకు నడిపించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక గుజరాత్లో ఆప్ విజయం సాధించడం పట్ల ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుందన్నారు. ఇక పంజాబ్లో కూడా విజయానికి దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రతి కార్యకర్తకు సంతోషకరమైన విషయంగా తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!