Parliament: పార్లమెంట్లో ఏం జరగబోతోంది..? ఎంపీలకు ‘‘ త్రీ లైన్ విప్’’ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
- పార్లమెంట్లో 13, 14న కీలక చర్చ..
- ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
- ‘‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’’, రాజ్యాంగంపై చర్చలే కారణమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament: ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు’’కి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, డిసెంబర్ 13-14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. ఉభయసభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరుకావాలని కోరింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది.
Read Also: Kiran Abbavarm : ‘క’ బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో తెలుసా ?
Also Read
- Nurse Transfer Request: మంత్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న నర్సు.. కారణం ఏంటంటే?
- International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
- NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
- International Yoga Day 2026: కోల్కతాలో 35,000 మందితో కలిసి ప్రధాని మోడీ యోగా.. 2026 థీమ్ ఏమిటి?
మరోవైపు కాంగ్రెస్ కూడా తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. డిసెంబర్ 13-14 తేదీల్లో సభకు తప్పకుండా హాజరవ్వాలని కోరింది. ఈ రెండు రోజుల్లో భారత రాజ్యాంగంపై చర్చ జరగనుంది. డిసెంబర్ 13-14న లోక్సభలో, డిసెంబర్ 16-17 వరకు రాజ్యసభలో చర్చ ఉండనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చ ప్రారంభించే అవకాశం ఉంది. లోక్సభలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లోని ఉభయసభల్లో చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభానాయకుడిగా ఉండగా, రాజ్నాథ్ సింగ్ లోక్సభలో డిప్యూటీ లీడర్గా ఉన్నారు. డిసెంబర్ 14న లోక్సభలో రాజ్యాంగంపై చర్చకు ప్రధాని నరేంద్రమోడీ సమాధానం ఇస్తారని విశ్వసనీయ సమాచారం.
మరోవైపు ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల్ని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. ఈ రోజు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏక కాలంలో 100 రోజలు వ్యవధిలో పట్టణ-పంచాయతీ ఎన్నికలతో సహా రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లుని పీఎం మోడీ ప్రశంసించారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని పెంపొందిచే దిశగా ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. రేంజ్, ఫీచర్లు ఇవే!
-
YS Jagan: ‘నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి’.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..
-
Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి జిగితార సాంగ్ రిలీజ్.. మణిశర్మ మెలోడీకి ఫ్యాన్స్ ఫిదా
-
Tilak Varma: “నువ్వు అస్సలు తగ్గొద్దు”.. శ్రీలంకతో ఫైనల్ ఫైట్కు ముందు వైభవ్కు తిలక్ ఫుల్ సపోర్ట్..
-
Chittoor: ‘ఆమె లేక నేను లేను’.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!