Parliament: పార్లమెంట్లో ఏం జరగబోతోంది..? ఎంపీలకు ‘‘ త్రీ లైన్ విప్’’ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
- పార్లమెంట్లో 13, 14న కీలక చర్చ..
- ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
- ‘‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’’, రాజ్యాంగంపై చర్చలే కారణమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament: ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు’’కి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, డిసెంబర్ 13-14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. ఉభయసభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరుకావాలని కోరింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది.
Read Also: Kiran Abbavarm : ‘క’ బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో తెలుసా ?
Also Read
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
మరోవైపు కాంగ్రెస్ కూడా తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. డిసెంబర్ 13-14 తేదీల్లో సభకు తప్పకుండా హాజరవ్వాలని కోరింది. ఈ రెండు రోజుల్లో భారత రాజ్యాంగంపై చర్చ జరగనుంది. డిసెంబర్ 13-14న లోక్సభలో, డిసెంబర్ 16-17 వరకు రాజ్యసభలో చర్చ ఉండనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చ ప్రారంభించే అవకాశం ఉంది. లోక్సభలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లోని ఉభయసభల్లో చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభానాయకుడిగా ఉండగా, రాజ్నాథ్ సింగ్ లోక్సభలో డిప్యూటీ లీడర్గా ఉన్నారు. డిసెంబర్ 14న లోక్సభలో రాజ్యాంగంపై చర్చకు ప్రధాని నరేంద్రమోడీ సమాధానం ఇస్తారని విశ్వసనీయ సమాచారం.
మరోవైపు ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల్ని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. ఈ రోజు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏక కాలంలో 100 రోజలు వ్యవధిలో పట్టణ-పంచాయతీ ఎన్నికలతో సహా రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లుని పీఎం మోడీ ప్రశంసించారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని పెంపొందిచే దిశగా ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
-
Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..