Parliament: పార్లమెంట్లో ఏం జరగబోతోంది..? ఎంపీలకు ‘‘ త్రీ లైన్ విప్’’ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
- పార్లమెంట్లో 13, 14న కీలక చర్చ..
- ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
- ‘‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’’, రాజ్యాంగంపై చర్చలే కారణమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament: ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు’’కి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, డిసెంబర్ 13-14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. ఉభయసభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరుకావాలని కోరింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది.
Read Also: Kiran Abbavarm : ‘క’ బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో తెలుసా ?
Also Read
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
మరోవైపు కాంగ్రెస్ కూడా తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. డిసెంబర్ 13-14 తేదీల్లో సభకు తప్పకుండా హాజరవ్వాలని కోరింది. ఈ రెండు రోజుల్లో భారత రాజ్యాంగంపై చర్చ జరగనుంది. డిసెంబర్ 13-14న లోక్సభలో, డిసెంబర్ 16-17 వరకు రాజ్యసభలో చర్చ ఉండనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చ ప్రారంభించే అవకాశం ఉంది. లోక్సభలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లోని ఉభయసభల్లో చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభానాయకుడిగా ఉండగా, రాజ్నాథ్ సింగ్ లోక్సభలో డిప్యూటీ లీడర్గా ఉన్నారు. డిసెంబర్ 14న లోక్సభలో రాజ్యాంగంపై చర్చకు ప్రధాని నరేంద్రమోడీ సమాధానం ఇస్తారని విశ్వసనీయ సమాచారం.
మరోవైపు ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల్ని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. ఈ రోజు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏక కాలంలో 100 రోజలు వ్యవధిలో పట్టణ-పంచాయతీ ఎన్నికలతో సహా రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లుని పీఎం మోడీ ప్రశంసించారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని పెంపొందిచే దిశగా ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
-
INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
-
Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
-
Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
-
VIDA VX2 Plus: 187KM రేంజ్తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!