Rahul Gandhi’s T-shirt: రాహుల్ గాంధీ టీ షర్టుపై బీజేపీ విమర్శలు.. భారతదేశమా చూడండి అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Comments On Rahul Gandhi’s T-shirt: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ గత వైభవాన్ని సంతరించుకోవాలని చూస్తోంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపుగా 3570 కిలోమీటర్ల మేర ఐదు నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ యాత్రను చేపట్టింది. కన్యాకుమారి నుంచి ఈ నెల 7 నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర కాశ్మీర్ లో ముగియనుంది. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టుపై బీజేపీ విమర్శలు చేస్తోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర రూ. 41,000 కన్నా ఎక్కువ అని బీజేపీ విమర్శలు చేస్తోంది. భారతదేశమా చూడండి అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది. ‘‘ భారత్, దేఖో’’ అంటూ రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, అతను ధరించిన టీషర్టు ఫోటోలను జతచేసి ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర రూ. 41,257 అని బీజేపీ పేర్కొంది.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్కు తిరుగులేదు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
Read Also: V Hanumantha Rao: సీనియర్లను పట్టించుకోవట్లేదు.. స్రవంతికి టికెట్ ఇవ్వడంపై వీహెచ్ స్పందన
బీజేపీ ట్వీట్ కు కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో బదులు ఇస్తోంది. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న జనాలను చూసి మీరు భయపడుతున్నారా..? నిరుద్యోగం, ద్రవ్యోల్భనం గురించి మాట్లాడండి అంటూ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. బట్టల గురించి మాట్లాడితే ముందుగా ప్రధాన మంత్రి రూ.10 లక్షల సూట్ గురించి చర్చించాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.
అంతకు ముందు రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రను తాను నాయకత్వం వహించడం లేదని.. కేవలం పాల్గొంటున్నానని.. విద్వేషాన్ని వ్యాప్తి చేసిన బీజేపీ-ఆర్ఎస్ఎస్ చేసిన నష్టాన్ని పూడ్చేందుకే యాత్రను ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రజల్లో ఐక్యత నెలకొల్పడంతో పాటు ప్రజలతో మమేకం అవ్వడం వారి సమస్యలు వినడం, బీజేపీ పాలనను వారికి తెలియజేయడం ఈ యాత్ర ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు.
Bharat, dekho! pic.twitter.com/UzBy6LL1pH
— BJP (@BJP4India) September 9, 2022
తాజావార్తలు
-
Medico Suicide: ఉప్పల్లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?