Rahul Gandhi’s T-shirt: రాహుల్ గాంధీ టీ షర్టుపై బీజేపీ విమర్శలు.. భారతదేశమా చూడండి అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Comments On Rahul Gandhi’s T-shirt: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ గత వైభవాన్ని సంతరించుకోవాలని చూస్తోంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపుగా 3570 కిలోమీటర్ల మేర ఐదు నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ యాత్రను చేపట్టింది. కన్యాకుమారి నుంచి ఈ నెల 7 నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర కాశ్మీర్ లో ముగియనుంది. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టుపై బీజేపీ విమర్శలు చేస్తోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర రూ. 41,000 కన్నా ఎక్కువ అని బీజేపీ విమర్శలు చేస్తోంది. భారతదేశమా చూడండి అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది. ‘‘ భారత్, దేఖో’’ అంటూ రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, అతను ధరించిన టీషర్టు ఫోటోలను జతచేసి ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర రూ. 41,257 అని బీజేపీ పేర్కొంది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: V Hanumantha Rao: సీనియర్లను పట్టించుకోవట్లేదు.. స్రవంతికి టికెట్ ఇవ్వడంపై వీహెచ్ స్పందన
బీజేపీ ట్వీట్ కు కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో బదులు ఇస్తోంది. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న జనాలను చూసి మీరు భయపడుతున్నారా..? నిరుద్యోగం, ద్రవ్యోల్భనం గురించి మాట్లాడండి అంటూ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. బట్టల గురించి మాట్లాడితే ముందుగా ప్రధాన మంత్రి రూ.10 లక్షల సూట్ గురించి చర్చించాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.
అంతకు ముందు రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రను తాను నాయకత్వం వహించడం లేదని.. కేవలం పాల్గొంటున్నానని.. విద్వేషాన్ని వ్యాప్తి చేసిన బీజేపీ-ఆర్ఎస్ఎస్ చేసిన నష్టాన్ని పూడ్చేందుకే యాత్రను ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రజల్లో ఐక్యత నెలకొల్పడంతో పాటు ప్రజలతో మమేకం అవ్వడం వారి సమస్యలు వినడం, బీజేపీ పాలనను వారికి తెలియజేయడం ఈ యాత్ర ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు.
Bharat, dekho! pic.twitter.com/UzBy6LL1pH
— BJP (@BJP4India) September 9, 2022
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!