Rahul Gandhi’s T-shirt: రాహుల్ గాంధీ టీ షర్టుపై బీజేపీ విమర్శలు.. భారతదేశమా చూడండి అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Comments On Rahul Gandhi’s T-shirt: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ గత వైభవాన్ని సంతరించుకోవాలని చూస్తోంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపుగా 3570 కిలోమీటర్ల మేర ఐదు నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ యాత్రను చేపట్టింది. కన్యాకుమారి నుంచి ఈ నెల 7 నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర కాశ్మీర్ లో ముగియనుంది. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టుపై బీజేపీ విమర్శలు చేస్తోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర రూ. 41,000 కన్నా ఎక్కువ అని బీజేపీ విమర్శలు చేస్తోంది. భారతదేశమా చూడండి అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది. ‘‘ భారత్, దేఖో’’ అంటూ రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, అతను ధరించిన టీషర్టు ఫోటోలను జతచేసి ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర రూ. 41,257 అని బీజేపీ పేర్కొంది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: V Hanumantha Rao: సీనియర్లను పట్టించుకోవట్లేదు.. స్రవంతికి టికెట్ ఇవ్వడంపై వీహెచ్ స్పందన
బీజేపీ ట్వీట్ కు కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో బదులు ఇస్తోంది. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న జనాలను చూసి మీరు భయపడుతున్నారా..? నిరుద్యోగం, ద్రవ్యోల్భనం గురించి మాట్లాడండి అంటూ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. బట్టల గురించి మాట్లాడితే ముందుగా ప్రధాన మంత్రి రూ.10 లక్షల సూట్ గురించి చర్చించాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.
అంతకు ముందు రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రను తాను నాయకత్వం వహించడం లేదని.. కేవలం పాల్గొంటున్నానని.. విద్వేషాన్ని వ్యాప్తి చేసిన బీజేపీ-ఆర్ఎస్ఎస్ చేసిన నష్టాన్ని పూడ్చేందుకే యాత్రను ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రజల్లో ఐక్యత నెలకొల్పడంతో పాటు ప్రజలతో మమేకం అవ్వడం వారి సమస్యలు వినడం, బీజేపీ పాలనను వారికి తెలియజేయడం ఈ యాత్ర ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు.
Bharat, dekho! pic.twitter.com/UzBy6LL1pH
— BJP (@BJP4India) September 9, 2022
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!