Congress: “కాశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్”.. కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఫైర్..
- కాశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్..
- కాంగ్రెస్ పోస్టర్లపై వివాదం..
- కాంగ్రెస్కి పాకిస్తాన్ అంటేనే ఇష్టం అంటూ బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ మరో వివాదంలో ఇరుక్కుంది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో జార్జ్ సోరోస్తో సంబంధాలు, రాహుల్ గాంధీ ఎంపీలను తోసివేయడం వంటి అంశాలపై బీజేపీ ఆ పార్టీని కార్నర్ చేసింది. తాజాగా కాంగ్రెస్ ‘‘భారతదేశ మ్యాపు’’ని వక్రీకరించడం వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లేకుండా భారతదేశ మ్యాపుని పోస్టర్లుగా వేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
కర్ణాటక బెలగావిలో కాంగ్రెస్ అత్యున్నత సమావేశం సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది. మహాత్మా గాంధీ ఏఐసీసీ సమావేశానికి అధ్యక్షత వహించి శతాబ్ది గడవడంతో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికోసం కాంగ్రెస్ పోస్టర్లను, బ్యానర్లను ప్రదర్శించింది. వీటిలో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా లేని భారతదేశ మ్యాపుని ఉంచారు. ఇప్పుడు ఇది వివాదంగా మారింది.
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
Read Also: Temple-Mosque disputes: మోహన్ భగవత్ వ్యాఖ్యలతో విభేదించిన ఆర్ఎస్ఎస్ పత్రిక..
బీజేపీ కర్ణాటక రాష్ట్ర విభాగం ఎక్స్ వేదికగా విమర్శలు చేసింది. ‘‘కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చిత్రీకరించడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా అగౌరవపరుస్తుంది’’ అని నిందించింది. ఇదంతా కేవలం తమ ఓటు బ్యాంకుని సంతోషపెట్టడానికే అని, ఇది సిగ్గుచేటని బీజేపీ పోస్ట్ చేసింది. బీజేపీ సీనియర్ నేత షెహజాద్ పూనావాలా ఈ వివాదంపై స్పందిస్తూ.. ఇది ‘‘భారత్ టోడో, తుక్డే-తుక్డే’’ ఆలోచనల్ని నొక్కి చెబుతోందని అన్నారు.
‘‘రాహుల్ గాంధీ కాశ్మీర్ పాకిస్తాన్లో భాగం కావాలనుకునే ఇల్హాన్ ఒమర్తో సమావేశమవుతారు. సోనియా గాంధీ కాశ్మీర్ పాకిస్తాన్కి ఇవ్వాలనే సంస్థకు సహ అధ్యక్షురాలు’’ అని పూనావాలా అన్నారు. ఇటీవల జార్జ్ సోరోస్ స్థాపించిన OCCRP లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ లింకులపై బీజేపీ కాంగ్రెస్ని విమర్శించింది. పాక్ పాటలు పాడటం, పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్ని అప్పగించడం కాంగ్రెస్ ఎజెండాగా ఉందని పూనావాలా దుయ్యబట్టారు. మరో బీజేపీ నేత అమిత్ మాల్వియా స్పందిస్తూ.. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల్లో భాగం, ఇది భారత ముస్లింలు పాకిస్తాన్కి మరింత విధేయులుగా ఉన్నారని సూచిస్తోందని, కాంగ్రెస్ కొత్త ముస్లింలీగ్ అని విమర్శించారు.
@INCKarnataka, has shown utter disrespect for India’s sovereignty by displaying a distorted map at their Belagavi event, portraying Kashmir as part of Pakistan. All this just to appease their vote bank. This is shameful!#CongressInsultsIndia #JammuAndKashmir pic.twitter.com/ql9JG73Dm9
— BJP Karnataka (@BJP4Karnataka) December 26, 2024
తాజావార్తలు
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!