Neha Murder Case: కాంగ్రెస్ కార్పొరేటర్ కుటుంబానికి జేపీ నడ్డా పరామర్శ.. నేహ హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neha Murder Case: కర్ణాటకలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది ఎంసీఏ విద్యార్థి నేహా హిరేమత్(23) హత్య కేసు. ఈ హత్య బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య విమర్శలకు దారి తీసింది. హుబ్బళ్లిలో కాలేజ్ క్యాంపస్లో నేహాని ఫయాజ్ అనే సహవిద్యార్థి కత్తితో పొడిచి చంపేశాడు. అయితే, ఈ ఘటనలో ‘లవ్ జిహాద్’ కోణం ఉందని బీజేపీ ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ అలాంటిదేం లేదని ఇది వ్యక్తిగత విషయమని చెబుతోంది. ఇదిలా ఉంటే తన కూతురును ట్రాప్ చేయడానికి గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారని, అందుకు లొంగకపోవడంతో హత్య చేశారని కాంగ్రెస్ కార్పొరేటర్, నేహ తండ్రి నిరంజన్ హిరేమత్ ఆరోపించారు.
Read Also: CM Revanth Reddy: రాజ్యాంగం రక్షించాలంటే..రాహుల్ ప్రధాని కావాలి..
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు నేహా కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధితురాలకి న్యాయం జరిగేలా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అందుకు బీజేపీ సహకరిస్తుందని అన్నారు. దు:ఖ సమయంలో వారి కుటుంబానికి అండగా ఉండటానికి వచ్చానని, ఈ హృదయవిదారక ఘటనను నేహ తల్లిదండ్రులు వివరించారని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు నిర్వహించలేకపోతే, కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్లు నడ్డా చెప్పారు. రాష్ట్రప్రభుత్వం కోరుకుంటే కేసును సీబీఐకి సిఫారసు చేయవచ్చు, అమాయక బాలికకు న్యాయం జరిగేలా, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం జరగకుండా బీజేపీ సహకరిస్తుందని, నేహా తండ్రి కూడా రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, ఆయన కూడా కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతున్నట్లు నడ్డా తెలిపారు.
ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದ ಓಲೈಕೆಯ ರಾಜಕಾರಣಕ್ಕೆ ಬಲಿಯಾದ ಹುಬ್ಬಳ್ಳಿಯ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ನೇಹಾ ಹಿರೇಮಠ್ ಅವರ ಮನೆಗೆ ಬಿಜೆಪಿ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ @JPNadda ಅವರು ಭೇಟಿ ನೀಡಿ ಕುಟುಂಬಸ್ಥರಿಗೆ ಧೈರ್ಯ ತುಂಬಿ, ಸಾಂತ್ವನ ಹೇಳಿದರು.
ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಲೋಕಸಭಾ ಚುನಾವಣಾ ರಾಜ್ಯ ಉಸ್ತುವಾರಿಗಳಾದ @AgrawalRMD, ಕೇಂದ್ರ ಸಚಿವರಾದ ಶ್ರೀ… pic.twitter.com/6y5zqMx03i
— BJP Karnataka (@BJP4Karnataka) April 21, 2024
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?