Kerala: కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర.. తొలిసారి తిరువనంతపురంలో..!
- కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర
- వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టిన కాషాయ పార్టీ
- అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బూస్టింగ్
కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టింది. తొలిసారి తిరువనంతపురం మేయర్ స్థానాన్ని కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ నేత వీవీ.రాజేష్ మేయర్గా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు వీవీ.రాజేష్ను మేయర్గా ఎంచుకున్నారు. దీంతో కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బూస్ట్ వచ్చినట్లైంది.
ఇది కూడా చదవండి: Lalu Prasad Yadav: లాలూ ఫ్యామిలీకి ఝలక్.. ప్రభుత్వ బంగ్లా నుంచి వస్తువులు తరలింపు!
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
వీవీ.రాజేష్కు 50 మంది బీజేపీ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర సభ్యుడు మద్దతు తెలిపారు. దీంతో రాజేష్ మేయర్గా ఎన్నికై కొత్త చరిత్ర సృష్టించారు. ఇక యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరినాథన్కు 17 ఓట్లు, ఎల్డీఎఫ్ మేయర్ అభ్యర్థి ఆర్పీ శివాజీకి 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వామపక్షాల కంచుకోటను బీజేపీ బద్ధలు కొట్టింది.
వీవీ.రాజేష్ బ్యాగ్రౌండ్ ఇదే..
వీవీ.రాజేష్ (50) ప్రస్తుతం తిరువనంతపురం కార్పొరేషన్లో కౌన్సిలర్గా రెండోసారి పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొడుంగనూర్ వార్డు నుంచి 515 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వృత్తిరీత్యా న్యాయవాది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. గతంలో తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడిగా.. బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వట్టియూర్కావు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 39,596 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. సీపీఐ(ఎం) అభ్యర్థి వీకే ప్రశాంత్పై ఓడిపోయారు. 1996 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. పార్టీ నిర్మాణం, ప్రజా జీవితంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ నేపథ్యమే మేయర్గా ఎన్నిక కావడానికి దారి తీశాయి.
Meet the BJP/NDA candidates for Mayor and Deputy Mayor of Thiruvananthapuram – Shri VV Rajesh and Smt. Asha Nath.
Both are committed karyakartas who are committed to serve the people of our capital city and solve the unsolved problems of decades.
And realize our goal of… pic.twitter.com/fwRrTaMmqB
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) December 25, 2025
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!