West Bengal: బాణాసంచా పేలి ఐదుగురు మృతి.. బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లోని అక్రమ బాణసంచా తయారీ కర్మాగారంలో మంగళవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కర్మాగారం పూర్తిగా ధ్వంసం అయింది. పేలుడు జరిగిన స్థలంలో చెల్లచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. పూర్బా మేదినీపూర్ లోని ఏగ్రాలో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు స్థానికుల్లో ఆగ్రహాన్ని పెంచింది. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన ప్రాంతం ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ పేలుడు సంభవించిన వెంటనే దాని యజమాని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Nitin Gadkari: నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు కాల్..
Also Read
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
ఇదిలా ఉంటే ఈ పేలుడు ఘటన రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), విపక్ష టీఎంసీ మధ్య మాటల యుద్ధాన్ని ప్రేరేపించింది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు ముందు తృణమూల్ బాంబులు తయారుచేస్తోందని, పేలుడుపై ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ బాంబుల తయారీ చేస్తున్న కర్మాగారం టీఎంసీ నాయకుడిదని, పంచాయతీ ఎన్నికల ముందు శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుంబర్ అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిషాను కోరారు.
బీజేపీ చేస్తున్న విమర్శలపై సీఎం మమతాబెనర్జీ విమర్శలు గుప్పించారు. అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న వ్యక్తిపై పోలీసులు ఇంతకుముందు కేసులు పెట్టి జైలుకు పంపారని, బెయిల్ పై విడుదలై మళ్లీ ప్రారంభించాడని ఆమె అన్నారు. ఈ కేసును సీఐడీ విచారిస్తోందని తెలిపింది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య లేదని ఆమె వెల్లడించారు. ఘటన జరిగిన పంచాయతీ ప్రాంతం బీజేపీ ఆధీనంలో ఉందని, దీంట్లో తృణమూల్ కు ఎలాంటి సంబంధం లేదని ఆమె అన్నారు. ఇలాంటి ఘటన జరిగిన సమయంలో రాజకీయాలు చేస్తారా..? అంటూ దీదీ మండిపడ్డారు.
తాజావార్తలు
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!