BJP: కాంగ్రెస్ ‘‘ఆధునిక ముస్లిం లీగ్’’.. అన్సారీ ‘‘గజినీ’’ కామెంట్స్పై బీజేపీ..
- గజినీపై మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలు..
- ‘‘భారతీయ దోపిడీదారుడు’’ అంటూ కామెంట్స్..
- కాంగ్రెస్, దాని ఎకో సిస్టమ్ ఇలాంటివి అలవాటే అని బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కాంగ్రెస్, దాని ఎకో సిస్టమ్ విదేశీ ఆక్రమణదారులను ప్రేమిస్తుందని, హిందూ వ్యతిరేక నిరంకుశులను కీర్తిస్తుందని బీజేపీ ఆరోపించింది. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ‘‘గజనీ’’పై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం తీవ్రంగా విమర్శించింది. విదేశీ ఆక్రమణ, దోపిడీదారులపై అన్సారీకి ఉన్న ప్రేమ అతని ‘‘వికృత మనస్తత్వాన్ని’’ చూపిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంషు త్రివేది అన్నారు.
చరిత్ర పుస్తకాల్లో విదేశీ ఆక్రమణదారులు, దోపిడీదారులుగా పేర్కొన్న గజినీ మహ్మద్ వాస్తవానికి ‘‘భారతీయ దోపిడీదారుడు‘‘అని అన్సారీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వివాదాస్పదమైంది. గజినీ, లోడీ వంటి వారు బయట నుంచి రాలేదని, వారందరూ భారతీయులే అని ఒక ఇంటర్వ్యూలో అన్సారీ చెప్పారు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: Raipur Central Jail: ఆ కేసులో అరెస్టైన ప్రియుడు.. జైలుకెళ్లి సర్ ప్రైజ్ చేసిన ప్రియురాలు..
ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ‘‘సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి, అపవిత్రం చేసిన గజినీని కీర్తించడం, ఢిల్లీ అల్లర్ల నిందితులు షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్లను యువకులు అని పిలవడం కాంగ్రెస్ ఎకో సిస్టమ్కు అలవాటే , వారు సోమనాథ్ ఆలయానికి వ్యతిరేకం, ఔరంగాజేబు లాంటి వారి నేరాలను కప్పిపుచ్చుతారు, హిందువులపై జరిగిన అఘాయిత్యాలను పట్టించుకోరు. వారికి భారత్, హిందువులు అంటే ద్వేషం’’ అని అన్నారు.
మరో బీజేపీ నేత ప్రదీప్ భండారీ కూడా కాంగ్రెస్, అన్సారీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ‘‘ఆధునిక ముస్లిం లీగ్’’ అని అభివర్ణించారు. భారత ఉపరాష్ట్రపతిగా చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. మొగల్ చక్రవర్తులందరూ బాగ్దాద్ ఖలీఫా పేరుతో పాలించారని, ఎలాగైతే బ్రిటీష్ వారు రాజు లేదా రాణి పేరుతో పాటించారో మొఘలులు కూడా అలాగే పాలించారని అన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!