Bihar Politics: నితీష్ వలస పక్షి, అధికారం కోసం ఏదైనా చేస్తాడు.. బీజేపీ విమర్శలు
BJP criticizes Nitish Kumar: బీజేపీ బంధానికి స్వస్తి చెప్పి ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ వైదొలిగింది. దీంతో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రేపటి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. అయితే బీజేపీతో బంధాన్ని తెంచుకోవడంపై బీజేపీ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
2017లో జేడీయూను విచ్ఛిన్నం చేయడానికి ఆర్జేడీ ప్రయత్నిస్తుందని నితీష్ కుమార్ అన్నారు.. ఇప్పుడు మళ్లీ జేడీయూను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని అంటున్నారని.. బీజేపీ నుంచి విడిపోవడానికే నితీష్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. తన వ్యక్తిగత ఆశయాల కోసం ఇలా చేస్తున్నారని.. బీహార్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని.. బీహార్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం తార కిషోర్ ప్రసాద్ విమర్శించారు. నితీష్ కుమార్ కాంగ్రెసేతర నాయకుడు.. ఆయన రాజకీయం కాంగ్రెస్ వ్యతిరేకంగా నడించింది.. అయితే తాజాగా కాంగ్రెసేతర వాదంతో రాజీకి వచ్చాడని.. అవినీతి, కాంగ్రెస్ వాదం వైపు నితీష్ కుమార్ నిలిచాడని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.
Also Read
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
- Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
Read Also: Bihar Politics : శివసేన తరహాలో జేడీయూలో చీలికకు బీజేపీ ప్రయత్నించిందా..?
కేంద్ర మంత్ర నిత్యనంద రాయ్ మాట్లాడుతూ.. 1975 బీహార్ ఉద్యంలో యువత తమ ప్రాణాలు అర్పించారని.. నితీష్ కుమార్, కాంగ్రెస్- ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం వల్ల యువత చేసిన బలిదానాలను మోసం చేస్తున్నారని.. 15 ఏళ్ల అరాచకం, తీవ్రవాదంతో రాజీపడటం ఏంటని ప్రశ్నించారు. ఆర్జేడీ, తేజస్వీ యాదవ్ తో కలిసి వెళ్లడం బీహార్ ప్రజలను మోసం చేయడమే అని..లోహియా-జేపీ-జార్జ్ సిద్ధాంతాలకు ద్రోహం చేశారని నిత్యానందరాయ్ విమర్శించారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కూటమి కట్టడం అంటే.. నితీష్ అధికారం కోసం ఏదైనా చేస్తాడని రుజువు చేసిందని విమర్శలు గుప్పించారు. హర్యానా హోంశాఖ మంత్రి అనిత్ విజ్, నితీష్ కుమార్ వ్యవహారంపై సంచలన ట్వీట్ చేశారు. నితీష్ కుమార్ వలస పక్షి అని.. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు దునుకుతున్నాడని.. ప్రస్తుతం పక్షులంతా ఒక కొమ్మమీద ఉన్నాయి.. ఇందులో ఎప్పుడు, ఎవరు, ఎక్కడ ఎగరతారో ఎవరకీ తెలియదంటూ.. పరోక్షంగా అసమ్మతి గురించి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్ఎస్జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!
-
Super Over Stats: సూపర్ ఓవర్లోని రన్స్, వికెట్లను బ్యాట్స్మెన్, బౌలర్ ఖాతాలో ఎందుకు కలపరు? ప్రధాన కారణాలు
-
Kara Movie Trailer: ధనుష్ ‘కర’ ట్రైలర్ రిలీజ్..
-
Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
-
EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!