Bihar Politics: నితీష్ వలస పక్షి, అధికారం కోసం ఏదైనా చేస్తాడు.. బీజేపీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP criticizes Nitish Kumar: బీజేపీ బంధానికి స్వస్తి చెప్పి ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ వైదొలిగింది. దీంతో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రేపటి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. అయితే బీజేపీతో బంధాన్ని తెంచుకోవడంపై బీజేపీ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
2017లో జేడీయూను విచ్ఛిన్నం చేయడానికి ఆర్జేడీ ప్రయత్నిస్తుందని నితీష్ కుమార్ అన్నారు.. ఇప్పుడు మళ్లీ జేడీయూను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని అంటున్నారని.. బీజేపీ నుంచి విడిపోవడానికే నితీష్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. తన వ్యక్తిగత ఆశయాల కోసం ఇలా చేస్తున్నారని.. బీహార్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని.. బీహార్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం తార కిషోర్ ప్రసాద్ విమర్శించారు. నితీష్ కుమార్ కాంగ్రెసేతర నాయకుడు.. ఆయన రాజకీయం కాంగ్రెస్ వ్యతిరేకంగా నడించింది.. అయితే తాజాగా కాంగ్రెసేతర వాదంతో రాజీకి వచ్చాడని.. అవినీతి, కాంగ్రెస్ వాదం వైపు నితీష్ కుమార్ నిలిచాడని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
Read Also: Bihar Politics : శివసేన తరహాలో జేడీయూలో చీలికకు బీజేపీ ప్రయత్నించిందా..?
కేంద్ర మంత్ర నిత్యనంద రాయ్ మాట్లాడుతూ.. 1975 బీహార్ ఉద్యంలో యువత తమ ప్రాణాలు అర్పించారని.. నితీష్ కుమార్, కాంగ్రెస్- ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం వల్ల యువత చేసిన బలిదానాలను మోసం చేస్తున్నారని.. 15 ఏళ్ల అరాచకం, తీవ్రవాదంతో రాజీపడటం ఏంటని ప్రశ్నించారు. ఆర్జేడీ, తేజస్వీ యాదవ్ తో కలిసి వెళ్లడం బీహార్ ప్రజలను మోసం చేయడమే అని..లోహియా-జేపీ-జార్జ్ సిద్ధాంతాలకు ద్రోహం చేశారని నిత్యానందరాయ్ విమర్శించారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కూటమి కట్టడం అంటే.. నితీష్ అధికారం కోసం ఏదైనా చేస్తాడని రుజువు చేసిందని విమర్శలు గుప్పించారు. హర్యానా హోంశాఖ మంత్రి అనిత్ విజ్, నితీష్ కుమార్ వ్యవహారంపై సంచలన ట్వీట్ చేశారు. నితీష్ కుమార్ వలస పక్షి అని.. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు దునుకుతున్నాడని.. ప్రస్తుతం పక్షులంతా ఒక కొమ్మమీద ఉన్నాయి.. ఇందులో ఎప్పుడు, ఎవరు, ఎక్కడ ఎగరతారో ఎవరకీ తెలియదంటూ.. పరోక్షంగా అసమ్మతి గురించి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!