Bihar Politics: నితీష్ వలస పక్షి, అధికారం కోసం ఏదైనా చేస్తాడు.. బీజేపీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP criticizes Nitish Kumar: బీజేపీ బంధానికి స్వస్తి చెప్పి ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ వైదొలిగింది. దీంతో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రేపటి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. అయితే బీజేపీతో బంధాన్ని తెంచుకోవడంపై బీజేపీ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
2017లో జేడీయూను విచ్ఛిన్నం చేయడానికి ఆర్జేడీ ప్రయత్నిస్తుందని నితీష్ కుమార్ అన్నారు.. ఇప్పుడు మళ్లీ జేడీయూను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని అంటున్నారని.. బీజేపీ నుంచి విడిపోవడానికే నితీష్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. తన వ్యక్తిగత ఆశయాల కోసం ఇలా చేస్తున్నారని.. బీహార్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని.. బీహార్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం తార కిషోర్ ప్రసాద్ విమర్శించారు. నితీష్ కుమార్ కాంగ్రెసేతర నాయకుడు.. ఆయన రాజకీయం కాంగ్రెస్ వ్యతిరేకంగా నడించింది.. అయితే తాజాగా కాంగ్రెసేతర వాదంతో రాజీకి వచ్చాడని.. అవినీతి, కాంగ్రెస్ వాదం వైపు నితీష్ కుమార్ నిలిచాడని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Bihar Politics : శివసేన తరహాలో జేడీయూలో చీలికకు బీజేపీ ప్రయత్నించిందా..?
కేంద్ర మంత్ర నిత్యనంద రాయ్ మాట్లాడుతూ.. 1975 బీహార్ ఉద్యంలో యువత తమ ప్రాణాలు అర్పించారని.. నితీష్ కుమార్, కాంగ్రెస్- ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం వల్ల యువత చేసిన బలిదానాలను మోసం చేస్తున్నారని.. 15 ఏళ్ల అరాచకం, తీవ్రవాదంతో రాజీపడటం ఏంటని ప్రశ్నించారు. ఆర్జేడీ, తేజస్వీ యాదవ్ తో కలిసి వెళ్లడం బీహార్ ప్రజలను మోసం చేయడమే అని..లోహియా-జేపీ-జార్జ్ సిద్ధాంతాలకు ద్రోహం చేశారని నిత్యానందరాయ్ విమర్శించారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కూటమి కట్టడం అంటే.. నితీష్ అధికారం కోసం ఏదైనా చేస్తాడని రుజువు చేసిందని విమర్శలు గుప్పించారు. హర్యానా హోంశాఖ మంత్రి అనిత్ విజ్, నితీష్ కుమార్ వ్యవహారంపై సంచలన ట్వీట్ చేశారు. నితీష్ కుమార్ వలస పక్షి అని.. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు దునుకుతున్నాడని.. ప్రస్తుతం పక్షులంతా ఒక కొమ్మమీద ఉన్నాయి.. ఇందులో ఎప్పుడు, ఎవరు, ఎక్కడ ఎగరతారో ఎవరకీ తెలియదంటూ.. పరోక్షంగా అసమ్మతి గురించి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!