BJP criticizes Nitish Kumar: బీజేపీ బంధానికి స్వస్తి చెప్పి ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ వైదొలిగింది. దీంతో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రేపటి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. అయితే బీజేపీతో బంధాన్ని తెంచుకోవడంపై బీజేపీ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.