Bihar Political Crisis: బీజేపీకి నితీష్ కుమార్ గుడ్ బై.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Political Crisis: ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లేందుకే సిద్ధ పడింది. తాజాగా సీఎం నితీష్ కుమార్, బీజేపీతో బంధాన్ని తెంచేసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ఫాగు చౌహన్ తో సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. బీజేపీతో అధికారం తెంచేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం నితీష్ కుమార్ తో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా గవర్నర్ ను కలవనున్నట్లు సమాచారం. దీంతో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీ మహా ఘట్ బంధన్ కూటమి బీహర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అయింది.
ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీయాదవ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము వెంటే ఉంటామని మద్దతు పలికారు. ఇక జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సీఎం నితీష్ కుమార్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడతాం అని తెలిపారు. దీంతో ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో ఉన్న 16 మంది బీజేపీ మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.
Also Read
- CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
- PM Modi Paper Leak Law: పేపర్ లీక్లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం
Read Also: Bihar Politics: బీజేపీ మాస్టర్ స్ట్రోక్.. ఒక రోజులోనే కోవిడ్ నుంచి కోలుకున్న స్పీకర్
సాయంత్రం 4 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన నితీష్ కుమార్.. ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య .. ‘‘రాజతిలకానికి సిద్ధం కండి.. బీహార్ లో లాంతర్( ఆర్జేడీ గుర్తు) పాలన వస్తుంది’’ అంటూ ట్వీట్ చేయడం ఇక బీహార్ లో మహా ఘట్ బంధన్ ప్రభుత్వం రానున్నట్లు చెప్పకనే చెప్పారు.
ఈ పరిణామాల మధ్య బీజేపీ సైలెంట్ గా ఉంది. అయితే బీజేపీ నెక్ట్ వ్యూహం ఏంటనేది ఇంకా అంతు చిక్కడం లేదు. అయితే 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో జేడీయూకు 45, ఆర్జేడీకి 79, కాంగ్రెస్ పార్టీకి 16 స్థానాలు, బీజేపీకి 77 స్థానాలు ఉన్నాయి. దీంతో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈజీగా మ్యాజిక్ ఫిగర్ 122 ను క్రాస్ చేయనున్నాయి.
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!