Bihar: మగ టీచర్కు మెటర్నిటీ లీవ్ మంజూరు.. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు
- బీహార్ విద్యాశాఖలో వింతైన సంఘటన
- మగ టీచర్కు మెటర్నిటీ లీవ్ మంజూరు
- నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ విద్యాశాఖలో వింతైన సంఘటన వెలుగు చూసింది. ఒక మగ ఉపాధ్యాయుడికి మెటర్నిటీ లీవ్ మంజూరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బీహార్ విద్యాశాఖలో సెలవులు కోసం ఆన్లైన్ దరఖాస్తు విధానం ఉంది. సెలవుల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేసుకుంటారు. అయితే ఒక మగ టీచర్కు మెటర్నిటీ సెలవులు మంజూరు అయ్యాయి. వారం రోజులుగా ఉపాధ్యాయుడు ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక పురుష ఉపాధ్యాయుడికి ప్రసూతి సెలవులు ఎలా మంజూరు చేస్తారంటూ ప్రశ్నించారు.
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..
విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో తప్పు ఒప్పుకున్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని.. ఆన్లైన్ పోర్టర్ను సరి చేస్తామని ఇన్ఛార్జ్ విద్యా అధికారి అర్చన కుమారి తెలిపారు. దరఖాస్తు ఫార్మాట్లో లోపం కారణంగానే ఉపాధ్యాయుడు జితేంద్ర కుమార్ సింగ్కు ప్రసూతి సెలవు మంజూరు అయిందని పేర్కొంది. లోపాన్ని సరిదిద్దుతామని వెల్లడించారు. ప్రసూతి సెలవులు కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తాయని.. అయితే పురుషులు కూడా తమ నవజాత శిశువులను చూసుకోవడానికి ‘పితృత్వ అవకాష్’ (ప్రసూతి సెలవు) పొందవచ్చని చెప్పుకొచ్చారు. అయినా తమ దృష్టికి వచ్చిన ఈ లోపాన్ని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: UDAN Yatri Cafe: ఎయిర్పోర్టులో రూ.10కి టీ, రూ. 20కి సమోసా.. ఎలా సాధ్యమైందంటే..
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?