UDAN Yatri Cafe: ఎయిర్పోర్టులో రూ.10కి టీ, రూ. 20కి సమోసా.. ఎలా సాధ్యమైందంటే..
- ఎయిర్పోర్టులో రూ.10కి టీ, రూ. 20కి సమోసా..
- ధరలను అరికట్టేందుకు కేంద్రం చర్యలు..
- ‘‘ఉడాన్ యాత్రి కేఫ్’’ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
- కోల్కతా ఎయిర్పోర్టులో పైలట్ ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UDAN Yatri Cafe: విమానాశ్రయాల్లోకి వెళితే వాటర్ బాటిల్ దగ్గర నుంచి అల్పాహారం వరకు ధరలు మండిపోతుంటాయి. అయితే, వీటికి ఉపశమనం కల్పించేందుకు పౌర విమానయాన శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. కోల్కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల కోసం ‘‘ఉడాన్ యాత్రి కేఫ్’’ని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అధిక ధరల్ని నిరోధించడానికి, విమాన యాత్రికులకు అందుబాటులో ధరలు ఉంచాలని లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టుని ప్రారంభించారు.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రారంభించబడిన ఈ కేఫ్లో బడ్జెట్కు అనుకూలంగా ఉంది. వాటర్ బాటిల్స్ రూ. 10, టీ రూ. 10, కాఫీ రూ. 20, సమోసా రూ. 20కి లభిస్తాయి. ప్రస్తుతం కోల్కతా ఎయిర్పోర్టులో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఉడాన్ యాత్రి కేఫ్ ప్రారంభించారు. క్రమక్రమంగా దేశంలోని అన్ని విమానాశ్రయాలకు దీనిని విస్తరించనున్నారు.
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
Read Also: Maheshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ..
“ఉడాన్ యాత్రి కేఫ్ కేవలం ఫుడ్ అవుట్లెట్ మాత్రమే కాదు, ఇది ప్రజల కోసం ప్రయాణ అనుభవాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. సరసమైన ధరలకు కప్పు టీ, స్నాక్స్తో విమాన ప్రయాణాన్ని సుసంపన్నం చేయడం, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంలో మా నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తున్నాము” అని మంత్రి చెప్పారు.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల విమానాశ్రయాల్లో విపరీతమైన రేట్ల గురించి లేవనెత్తాన్నారు. ఆ తర్వాత కేంద్ర విమానయాన శాఖ నుంచి ఈ నిర్ణయం వచ్చింది. యాత్రి కేఫ్ ప్రారంభించడంపై చద్దా స్పందిస్తూ.. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విమానాశ్రయాల్లో ఆహార స్థోమత అంశాన్ని నేను హైలైట్ చేసిన తర్వాత కోల్కతా విమానాశ్రయంలో టీ ధరలు తగ్గించబడ్డాయి. ఇది మా ప్రజల విజయం, ఈ మార్పుకు ఉత్ప్రేరకం అయినందుకు నేను గర్వపడుతున్నానని అన్నారు. మరిన్ని విమానాశ్రయాల్లో ఈ సౌకర్యాన్ని తీసుకురావాలని ఆయన ఆశించారు.
తాజావార్తలు
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
-
Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
-
Xiaomi 17 Max: 8000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో.. షియోమీ 17 మ్యాక్స్ విడుదల
-
Sai Abhyankar: ట్రోల్స్ను ట్రెండ్గా మార్చిన సాయి అభ్యంకర్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!