Waqf board: వక్ఫ్ బోర్డు ఆగడాలు.. ప్రైవేట్, ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తుందన్న బీహార్ ఎంపీ..
- వక్ఫ్ బోర్డు ప్రైవేట్.. ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తోంది..
- గోవింద్పూర్ వివాదంపై బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Waqf board: బీహార్ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ డాక్టర్ సంజయ్ జైశ్వాల్ వక్ఫ్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాష్ట్ర సున్నీ వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఆరోపించిందని, సరైన డాక్యుమెంటేషన్ లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాట్నాలోని ఫతుహా ప్రాంతంలో వక్ఫ్ బోర్డు కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో జైశ్వాల్ నుంచి ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు తమ పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిన భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించి స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
గురువారం వివాదస్పద వక్ఫ్ సవరణ బిల్లు -2024ను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి), సమస్యను పరిష్కరించడానికి బీహార్ను సందర్శించింది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలో కూడిన ఈ కమిటీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తమ నివేదికను సమర్పించాలని భావిస్తోంది. ఇటీవల కాలంలో ఫతుహాలో వక్ఫ్ బోర్డు భూ ఆక్రమణలకు పాల్పడిందనే ఆరోపణలు వైరల్గా మారాయి. స్థానిక అధికారులు రంగంలోకి దిగి నివాసితులకు తాత్కాలిక ఉపశమనం కల్పించారు. వక్ఫ్ బోర్డు, భూమాఫియా కుమక్కయ్యారనే ఆరోపణలు స్థానిక నివాసితుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఉర్దూ పత్రాలకు హిందీ అనువాదాలు అందించమని అడిగినప్పుడు వక్ఫ్ బోర్డు సహకరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
బీజేపీ ఎంపీ ఫతుహాలోని గోవింద్ పూర్ గ్రామాన్ని సందర్శించారు. చాలా కాలంగా ఇక్కడి నివాసితులకు వక్ఫ్ బోర్డు నోటీసులు అందుతున్నాయని, వారు ఈ భూమి నుంచి స్థానికుల్ని వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారని ఎంపీ జైశ్వాల్ చెప్పారు. ఈ సమస్యలో ఎక్స్ వార్డ్ కౌన్సిలర్ ఎండీ బబ్లూ తలదూర్చారని, పదేళ్లుగా ఈ కేసులో కేసులో కీలకంగా వ్యవహరిస్తున్నాడని, వక్ఫ్ బోర్డు చేసిన క్లెయిమ్ కారణంగా రోడ్ల నిర్మాణంతో సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఆగిపోయినట్లు ఎంపీ వెల్లడించారు. వక్ఫ్ బోర్డు సరైన సాక్ష్యాలు సమర్పించకపోవడంతో ఇక్కడి ప్రజలకి పాట్నా హైకోర్టు ఉపశమనం కలిగించింది. నివాసితులు తుది తీర్మానం కోసం ఎదురుచూస్తు్న్నారు. అయితే, ఇక్కడి వివాదాస్పద స్థలంలో బబ్లూ ఖాన్ ఇంటిని నిర్మించుకున్నప్పటికీ, అతడికి నోటీసులు వెళ్లలేదని ఎంపీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!