Kolkata Doctor Case: వైద్యురాలికి న్యాయం చేయాలి.. జోక్యం కోరుతూ రాష్ట్రపతి, ప్రధానికి ఆర్జీ కర్ వైద్యుల లేఖ..
- రాష్ట్రపతి.. ప్రధాని జోక్యం చేసుకోవాలి..
- వైద్యురాలికి న్యాయం చేయాలని ఆర్జీ కర్ డాక్టర్ల లేఖ..
- కోల్కతా వైద్యురాలి ఘటనలో కొనసాగుతున్న నిరసనలు..
Kolkata Doctor Case: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఘటనపై ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతూనే ఉంది. 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన గురించి యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత యువతికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఇదిలా ఉంటే ఇప్పటికీ బెంగాల్ వ్యాప్తంగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి వైద్యులు, సాధారణ ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. నిన్న వైద్యులతో సీఎం మమతా బెనర్జీ సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పటికీ, వైద్యులు డిమాండ్లకు అంగీకరించకపోవడంతో ఈ సమావేశం జరగలేదు.
ఇదిలా ఉంటే, ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ వైద్యులు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యపై ప్రతిష్టంభన ముగించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రండ్ నాలుగు పేజీల లేఖను ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్, కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డాకు కూడా పంపారు.
Also Read
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ ‘రాజీనామాకు సిద్ధమే’ అని ప్రకటించడం వెనుక కారణాలు?
లేఖలో.. వైద్యులు ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు తాము ఎదుర్కొన్న సమస్యలను ఎత్తి చూపారు. వైద్యులు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి “మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాల కొరత” ఉందని పేర్కొన్నారు. ‘‘ అత్యంత నీచమైన నేరానికి గురైన మా సహోద్యోగికి న్యాయం జరిగేలా, పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని హెల్త్ వర్కర్స్ అయిన మేమే, భయాందోళన లేకుండా ప్రజలకు మా విధులను నిర్వర్తించగలగాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ కష్ట సమయాల్లో మీ జోక్యం మనందరికి వెలుగునిస్తుందని, మన చుట్టూ ఉన్న చీకటి నుంచి బయటపడేలా మార్గాన్ని చూపుతుందని వారు లేఖలో పేర్కొన్నారు.
‘‘ భయంకరమైన నేరాన్ని, దానిని కప్పిపుచ్చడానికి ఆరోపించిన ప్రయత్నాలను, తదనంతర భయాందోళన వాతావరణ దేశాన్ని మెల్కొ్ల్పాయి. నిష్పాక్షిక దర్యాప్తు మరియు సత్వర, న్యాయమైన మరియు హేతుబద్ధమైన విచారణను కోరుతున్నాయి’’ అని లేఖలో వైద్యులు రాశారు. న్యాయం కోసం తమ డిమాండ్లను వ్యక్తం చేస్తూ ‘‘రీక్లెయిమ్ ది నైట్’’ వంటి ఉద్యమానికి పశ్చిమ బెంగాల్ ప్రజలు, బాధిత వైద్యురాలికి సంఘీభావం తెలిపారని జూనియర్ డాక్టర్లు లేఖలో హైలెట్ చేశారు.
తాజావార్తలు
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
-
Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
-
US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!