Lok Sabha Elections 2024: ఎన్నికల పండగకు అంతా సిద్ధం.. రేపు తొలి విడత పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: ఎన్నికల పండగకు దేశమంతా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం తొలి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 16.63 కోట్ల మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకుని 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఎన్నికల సంఘం 18 లక్షల మంది పోలింగ్ అధికారులను మోహరించింది. శాంతియుతంగా ఎన్నికలు జరగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ఎన్ని స్థానాలు, ఎంత మంది ఓటర్లు:
తొలి విడత ఎన్నికలు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 16.63 కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది స్త్రీ ఓటర్లతో పాటు 11,371 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 35.67 లక్షల మంది మొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 20-29 ఏళ్ల మధ్యలో 3.51 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం 41 హెలికాప్టర్లను, 84 ప్రత్యేక రైళ్లను, దాదాపుగా లక్ష వాహనాలను పోలింగ్ సిబ్బందిని తరలించేందుకు ఉపయోగిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటుతో పాటు 50 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయనున్నారు. మొత్తం 4,627 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5,208 స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్లు, 2,028 వీడియో సర్వైలెన్స్ టీమ్లు మరియు 1,255 వీడియో వ్యూయింగ్ టీమ్లు ఓటర్లను ఏ విధంగా ప్రేరేపించకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి.
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీరు, టాయిలెట్లు, ర్యాంప్లు, వాలంటీర్లు, వీల్ చైర్లు వంటి సౌకర్యాలను కల్పించారు. 5000కి పైగా పోలింగ్ స్టేషన్లను పూర్తిగా మహిళలే నిర్వహించనున్నారు. ECI పోలింగ్ స్టేషన్లలో గుర్తింపు ధృవీకరణ కోసం ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ (EPIC) కాకుండా 12 ప్రత్యామ్నాయ పత్రాలను కూడా అందించింది.
తాజావార్తలు
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!