Electoral Bonds: “లాటరీ కింగ్” నుంచి డీఎంకేకి భారీ నిధులు.. ఎవరీ శాంటియాగో మార్టిన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే లాటరీ కింగ్గా పిలువబడే శాంటియాగో మార్టిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మొత్తం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో ఈయన కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ రూ. 1368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా.. ఇందులో ఏకంగా 37 శాతం అంటే రూ. 509 కోట్లు విరాళంగా తమిళనాడు అధికార పార్టీకి డీఎంకేకి ముట్టచెప్పింది. డీఎంకేకి మొత్తం విచ్చని విరాళాలు రూ. 656.5 కోట్లు కాగా, ఒకే సంస్థ ఈ స్థాయిలో నిధులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
మేఘా ఇంజినీరింగ్ (రూ. 105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 14 కోట్లు) మరియు సన్ టివి (రూ. 100 కోట్లు)లు డీఎంకేకు విరాళాలు ఇచ్చిన జాబితాలో ఉన్నారు. ఎలక్షన్ కమీషణ్ ఈ రోజు ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను ప్రజల ముందుంచింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019 ముందు కాలానికి చెందినివిగా భావిస్తున్నారు. ఈ డేటా ప్రకారం.. 2018లో బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక మొత్తంలో (రూ. 6,986.5 కోట్లు) బాండ్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రెండవ అతిపెద్ద గ్రహీత (రూ. 1,397 కోట్లు) తర్వాత కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు) BRS (రూ. 1,322 కోట్లు), ఒడిశా అధికార పార్టీ బీజేడీ (రూ.944.5) తర్వాతి స్థానాల్లో ఉండగా.. డీఎంకే ఆరో స్థానంలో ఉంది.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: MK Stalin: సీఏఏ తర్వాత బీజేపీ టార్గెట్ ఇదే.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..
శాంటియాగో మార్టిన్ ఎవరు..?
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ప్రస్తుతం ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అధినేత శాంటియాగో మార్టిన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019-2024 మధ్య ఏకంగా రూ. 1368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాడు.
మార్టిన్ తన టీనేజ్లో ఉన్నప్పుడు లాటరీ టిక్కెట్లు విక్రయించేవారు. అంచెలంచెలుగా ఎదుగుతూ లాటరీ నుంచి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. టీనేజ్ వయసులో మయన్మార్లో పనిచేసి, 1980 చివర్లో భారత్కి తిరిగి వచ్చాడు. కోయంబత్తూర్ కేంద్రంగా తన వ్యాపారాన్ని విస్తరించాడు.
ఇతని టూ డిజిట్ లాటరీ ఈ ప్రాంతంలో విశేష ఆదరణ పొందింది. మార్టిన్ ఇతర రాష్ట్రాలకు, చివరకు పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్లకి కూడా విస్తరించాడు. ఈ దేశాల్లో లాటరీ టికెట్ల విక్రయంలో ఇతడి గుత్తాధిపత్యం ఉందని సమాచారం. కొన్నేళ్లుగా దర్యాప్తు సంస్థలు పలు కేసుల్లో మార్టిన్ వ్యాపార ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి, ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాయి. మార్టిన్ గ్రూప్ చట్టాలను పాటిస్తు్న్నాయని మార్టిన్ చెబుతున్నాడు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!