Swati Maliwal assault: స్వాతి మలివాల్ దాడి కేసు.. ఫోన్ ఫార్మాట్ చేసిన బిభవ్ కుమార్, సీసీటీవీ ట్యాంపరింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal assault: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఆప్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. దాడికి పాల్పడిన బిభవ్ కుమార్ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎయిమ్స్ నివేదికలో స్వాతిమలివాల్ కాలిపై, చెంపపై గాయాలు ఉన్నట్లుగా తేలింది. ఇదిలా ఉంటే, నిందితుడిగా ఆరోపించబడుతున్న బిభవ్ కుమార్ తన ఫోన్ని ఫార్మాట్ చేశాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అతను ఫోన్ని ఫార్మాట్ చేసి దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు.
మే 13న సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. బిభవ్ కుమార్ కస్టడీ కోరుతూ తన రిమాండ్ రిపోర్టులో, అరెస్ట్ చేయడానికి ఒక రోజు ముందు అతను తన ఫోన్ని ముంబైలో ఫార్మాట్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. శనివారం బిభవ్ కుమార్ బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ కోర్టు దీనిని తోసిపుచ్చుతూ, 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కొన్ని లోపాల కారణంగా తన మొబైల్ ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అతను పోలీసులకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిభవ్ కుమార్ ఫోన్ నుంచి డేటా పొందేందుకు పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని కోరే అవకాశం ఉంది.
Also Read
- Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
Read Also: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ!
ఆదివారం కేజ్రీవాల్ నివాసం నుంచి దాడి జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఖాళీగా ఉన్నందున సాక్ష్యాలు తారుమారు చేసి ఉంటారని పోటీసులు అనుమానిస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేజ్రీవాల్ నివాసం నుంచి ఆదివారం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి బిభవ్ కుమార్ని ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
స్వాతి మలివాల్పై దాడి జరగలేదని ఆప్ మంత్రి అతిషి మార్లెనా ఆరోపించారు. ఇదంతా బీజేపీ కుట్రగా అభివర్ణించారు. స్వాతి మలివాల్ అవినీతి కేసుల్లో ఇరుక్కోవడంతో బీజేపీ ఆమెను బ్లాక్మెయిల్ చేస్తోందని అన్నారు. మరోవైపు ఈ అంశం బీజేపీ వర్సెస్ ఆప్గా మారింది. స్వాతి మలివాల్పై దాడి గురించి కేజ్రీవాల్ మౌనంగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నిస్తోంది.
తాజావార్తలు
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!