Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రపై కేరళ హైకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petition in Kerala High Court on India Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోసం, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ‘ భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 14వ రోజుకు చేరింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 5 నెలల తర్వాత కాశ్మీర్ లో ముగియనుంది. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే అదే విధంగా వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.
Read Also: Early Diwali to India: ఇండియాకి ఈ ఏడాది ముందే దీపావళి
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
తాజాగా రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ను నియత్రించాటంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. భారత్ జోడో యాత్ర కారణంగా రాష్ట్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ.. కోర్టుకెక్కాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్ర జరుగుతోంది. అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని న్యాయవాది కే. విజయన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే యాత్ర జరిగేలా.. మరోవైపు వాహనాలు వెళ్లే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కే. విజయన్ కోర్టును కోరారు.
భారత్ జోడో యాత్ర కారణంగా ఇటీవల జాతీయరహదారిని నాలుగు గంటల పాటు మూసేశారని.. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. పిటిషన్ లో పేర్కొన్నాడు. అలాగే రాహుల్ గాంధీ యాత్ర కోసం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారని.. దీనికి అయ్యే ఖర్చంతా కాంగ్రెస్ పార్టీనే భరించాలని.. ప్రజల సొమ్ము వినియోగంచకుండా చూడాలని కోరారు. కేరళ ప్రజా రహదారుల చట్టం 2011ను భారత్ జోడో యాత్ర ఉల్లంఘిస్తోందని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ యాత్రపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందింది. యాత్రలో పిల్లల్ని వినియోగిస్తున్నారని.. ఇది వారిపై ప్రభావం చూపిస్తుందని కేంద్ర బాలల హక్కుల సంఘం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..