IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- జూలై 15 నుంచి భారత్-యూకే FTA అమల్లోకి.
- డిఫెండర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లపై దిగుమతి సుంకం భారీగా తగ్గింపు.
- స్కాచ్ విస్కీపై సుంకం 150% నుంచి దశలవారీగా 40%కు.
- యూకేలో భారతీయ వస్తువుల 99%పై సున్నా సుంకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND-UK FTA: యునైటెడ్ కింగ్డమ్(యూకే)-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూలై 15న అమలులోకి వస్తోంది. భారత్లోకి వచ్చే బ్రిటిష్ వస్తువులపై గణనీయంగా ధరలు తగ్గబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వచ్చిన తర్వాత బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లు, విస్కీ, ఇతర ఉత్పత్తులపై ధరలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా కార్ల ధరలు 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే ల్యాండ్ రోవర్, జాగ్వార్, రోల్స్ రాయిస్ , ఆస్టన్ మార్టిన్ వంటి కార్లు చౌక ధరలకే లభిస్తాయి.
చౌకగా కార్లు:
భారత్-యూకే వాణిజ్య ఒప్పందం ప్రకారం.. రెండు దేశాల మధ్య చాలా వస్తువులపై సున్నా లేదా తగ్గించిన సుంకాలు అమలులోకి వస్తాయి. నోటిఫికేషన్ ప్రకారం, మొదటి ఏడాది 20,000 కార్లను తగ్గించిన సుంకంతో దిగుమతి చేసుకోవచ్చు. 3000 సీసీ(పెట్రోల్), 2500 సీసీ(డీజిల్)కి పైబడిన 10,000 కార్లను దిగుమతి చేసుకోవచ్చు. వీటిపై కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గిస్తారు. 1500 సీసీ నుంచి 3000 సీసీ శ్రేణిలోకి వచ్చే 5000 కార్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ కార్లపై దిగుమతి సుంకాన్ని 66 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తారు. దీని తర్వాత క్రమంగా సుంకాలను తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఈ కార్లపై సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తారు. దీంతో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రేంజ్ రోవర్, జాగ్వార్, రోల్స్-రాయిస్, ఆస్టన్ మార్టిన్, బెంట్లీ వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
Also Read
- Congress: “జ్ఞానేశ్ కుమార్ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
- Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
- Vinod Tawde: యూపీ ఎన్నిలక కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. బరిలోకి దిగిన ‘‘సైలెంట్ స్ట్రాటజిస్ట్’’..
- Trump: భారత్ ఎన్నికల వ్యవస్థ సూపర్.. ట్రంప్ ప్రశంసలే.. ప్రశంసలు
99 శాతం భారతీయ వస్తువులపై జీరో టారిఫ్:
ఇదే సమయలో భారత్ నుంచి బ్రిటన్కు ఎగుమతి అయ్యే వస్తువులపై జీరో టారిఫ్ ఉంటుంది. యూకేలో వస్త్రాలపై 12 శాతం సుంకం, రసాయనాలపై 8 శాతం, బేస్ మెటల్స్పై 10 శాతం సుంకం ఉంటుంది. కానీ ఇప్పుడు, ఈ ఒప్పందంతో, యూకేలో 99 శాతం వస్తువులు ‘0%’ సుంకం పరిధిలోకి వస్తాయి.
సగం ధరకే స్కాచ్ విస్కీ:
ప్రస్తుతం భారతదేశంలో స్కాచ్ విస్కీపై 150 శాతం దిగుమతి సుంకం ఉంది. ఎఫ్టీఏ అమలులోకి వచ్చిన తర్వాత ఈ సుంకాన్ని దశల వారీగా 40 శాతం వరకు తగ్గించనున్నారు. ఏకంగా 110 శాతం తగ్గడం ద్వారా బ్రిటిష్ స్కాచ్ విస్కీ చౌకగా మారుతుంది.
తాజావార్తలు
-
Congress: “జ్ఞానేశ్ కుమార్ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
-
Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
-
Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
-
Nayanthara : నయనతార కళ్ళు తెరిపించిన బిజినెస్ ?
-
Vinod Tawde: యూపీ ఎన్నిలక కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. బరిలోకి దిగిన ‘‘సైలెంట్ స్ట్రాటజిస్ట్’’..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!