IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- జూలై 15 నుంచి భారత్-యూకే FTA అమల్లోకి.
- డిఫెండర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లపై దిగుమతి సుంకం భారీగా తగ్గింపు.
- స్కాచ్ విస్కీపై సుంకం 150% నుంచి దశలవారీగా 40%కు.
- యూకేలో భారతీయ వస్తువుల 99%పై సున్నా సుంకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND-UK FTA: యునైటెడ్ కింగ్డమ్(యూకే)-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూలై 15న అమలులోకి వస్తోంది. భారత్లోకి వచ్చే బ్రిటిష్ వస్తువులపై గణనీయంగా ధరలు తగ్గబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వచ్చిన తర్వాత బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లు, విస్కీ, ఇతర ఉత్పత్తులపై ధరలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా కార్ల ధరలు 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే ల్యాండ్ రోవర్, జాగ్వార్, రోల్స్ రాయిస్ , ఆస్టన్ మార్టిన్ వంటి కార్లు చౌక ధరలకే లభిస్తాయి.
చౌకగా కార్లు:
భారత్-యూకే వాణిజ్య ఒప్పందం ప్రకారం.. రెండు దేశాల మధ్య చాలా వస్తువులపై సున్నా లేదా తగ్గించిన సుంకాలు అమలులోకి వస్తాయి. నోటిఫికేషన్ ప్రకారం, మొదటి ఏడాది 20,000 కార్లను తగ్గించిన సుంకంతో దిగుమతి చేసుకోవచ్చు. 3000 సీసీ(పెట్రోల్), 2500 సీసీ(డీజిల్)కి పైబడిన 10,000 కార్లను దిగుమతి చేసుకోవచ్చు. వీటిపై కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గిస్తారు. 1500 సీసీ నుంచి 3000 సీసీ శ్రేణిలోకి వచ్చే 5000 కార్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ కార్లపై దిగుమతి సుంకాన్ని 66 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తారు. దీని తర్వాత క్రమంగా సుంకాలను తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఈ కార్లపై సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తారు. దీంతో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రేంజ్ రోవర్, జాగ్వార్, రోల్స్-రాయిస్, ఆస్టన్ మార్టిన్, బెంట్లీ వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
99 శాతం భారతీయ వస్తువులపై జీరో టారిఫ్:
ఇదే సమయలో భారత్ నుంచి బ్రిటన్కు ఎగుమతి అయ్యే వస్తువులపై జీరో టారిఫ్ ఉంటుంది. యూకేలో వస్త్రాలపై 12 శాతం సుంకం, రసాయనాలపై 8 శాతం, బేస్ మెటల్స్పై 10 శాతం సుంకం ఉంటుంది. కానీ ఇప్పుడు, ఈ ఒప్పందంతో, యూకేలో 99 శాతం వస్తువులు ‘0%’ సుంకం పరిధిలోకి వస్తాయి.
సగం ధరకే స్కాచ్ విస్కీ:
ప్రస్తుతం భారతదేశంలో స్కాచ్ విస్కీపై 150 శాతం దిగుమతి సుంకం ఉంది. ఎఫ్టీఏ అమలులోకి వచ్చిన తర్వాత ఈ సుంకాన్ని దశల వారీగా 40 శాతం వరకు తగ్గించనున్నారు. ఏకంగా 110 శాతం తగ్గడం ద్వారా బ్రిటిష్ స్కాచ్ విస్కీ చౌకగా మారుతుంది.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?