Early Diwali to India: ఇండియాకి ఈ ఏడాది ముందే దీపావళి
Early Diwali to India: మన దేశానికి ఈ ఏడాది దీపావళి పండుగ ముందే రానుందని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలకూ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇండియాకి లెదర్, టెక్స్టైల్, జ్యులరీ, ప్రాసెస్డ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఎగుమతులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అగ్రిమెంట్తో రెండు దేశాల్లోనూ మరింత మంది ఉద్యోగాలు పొందుతారని, గ్రోత్ సాధ్యమవుతుందని, మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
హైదరాబాద్లో ఇన్నోవేషన్ ల్యాబ్
Also Read
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
- Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
డిజిటల్ మార్కెటింగ్ మరియు యాడ్ టెక్ సర్వీసులను అందిస్తున్న బ్రైట్కామ్ గ్రూప్ హైదరాబాద్లో క్వాంటం కంప్యూటింగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ని ఏర్పాటుచేయనుంది. క్వాల్యాబ్జ్ ఇంక్తో కలిసి సిమ్యులేటర్లను, ఇతర ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తేనుంది. క్వాంటం కంప్యూటింగ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఈ గ్రూపు గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్వాల్యాబ్జ్ ఇంక్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, NLP, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం AI వంటి రంగాల్లో నైపుణ్యాలను సాధించింది.
Jogi Ramesh: అది ప్రతిపక్షం కాదు.. పనికిరాని పక్షం
2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు
2030 నాటికి ఇండియా ఫిన్టెక్ మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరనుందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్-2022లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో పెట్టుబడులు ఇన్సూర్టెక్, వెల్త్టెక్ తదితర సెక్టార్లకు సమానంగా పంపిణీ అవుతాయని తెలిపారు. భవిష్యత్లో ఫిన్టెక్ రంగంలో MSMEలకు అకౌంట్ అగ్రిగేటర్, UPI మరియు ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్డ్ నెట్వర్క్ ద్వారా నగదు ప్రవాహం పెరగనుందని చెప్పారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఇవాళ స్టాక్ మార్కెట్లు అత్యంత స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. తర్వాత కాసేపటికే కొద్దిపాటి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 59701 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17772 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. మారుతీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, ఐటీసీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. బంగారం కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది. సిల్వర్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. 187 పాయింట్లు లాభపడింది. రూపాయి విలువ 9 పైసలు తగ్గి 79.61 వద్ద నిలకడగా ఉంది.
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!