Early Diwali to India: ఇండియాకి ఈ ఏడాది ముందే దీపావళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Early Diwali to India: మన దేశానికి ఈ ఏడాది దీపావళి పండుగ ముందే రానుందని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలకూ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇండియాకి లెదర్, టెక్స్టైల్, జ్యులరీ, ప్రాసెస్డ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఎగుమతులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అగ్రిమెంట్తో రెండు దేశాల్లోనూ మరింత మంది ఉద్యోగాలు పొందుతారని, గ్రోత్ సాధ్యమవుతుందని, మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
హైదరాబాద్లో ఇన్నోవేషన్ ల్యాబ్
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
డిజిటల్ మార్కెటింగ్ మరియు యాడ్ టెక్ సర్వీసులను అందిస్తున్న బ్రైట్కామ్ గ్రూప్ హైదరాబాద్లో క్వాంటం కంప్యూటింగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ని ఏర్పాటుచేయనుంది. క్వాల్యాబ్జ్ ఇంక్తో కలిసి సిమ్యులేటర్లను, ఇతర ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తేనుంది. క్వాంటం కంప్యూటింగ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఈ గ్రూపు గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్వాల్యాబ్జ్ ఇంక్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, NLP, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం AI వంటి రంగాల్లో నైపుణ్యాలను సాధించింది.
Jogi Ramesh: అది ప్రతిపక్షం కాదు.. పనికిరాని పక్షం
2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు
2030 నాటికి ఇండియా ఫిన్టెక్ మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరనుందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్-2022లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో పెట్టుబడులు ఇన్సూర్టెక్, వెల్త్టెక్ తదితర సెక్టార్లకు సమానంగా పంపిణీ అవుతాయని తెలిపారు. భవిష్యత్లో ఫిన్టెక్ రంగంలో MSMEలకు అకౌంట్ అగ్రిగేటర్, UPI మరియు ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్డ్ నెట్వర్క్ ద్వారా నగదు ప్రవాహం పెరగనుందని చెప్పారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఇవాళ స్టాక్ మార్కెట్లు అత్యంత స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. తర్వాత కాసేపటికే కొద్దిపాటి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 59701 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17772 వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. మారుతీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, ఐటీసీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. బంగారం కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది. సిల్వర్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. 187 పాయింట్లు లాభపడింది. రూపాయి విలువ 9 పైసలు తగ్గి 79.61 వద్ద నిలకడగా ఉంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!