Bhagat Singh Koshyari: గుజరాతీ-రాజస్థానీ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన మహారాష్ట్ర గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor bhagat singh koshyari Apologises For Gujaratis-Rajasthanis comments: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో గుజరాతీలు, రాజస్థానీలు థానే, ముంబై, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే ఇక్కడ డబ్బులు మిగలవని.. ఇక ముంబై ఆర్థిక రాజధానిగా ఉండబోదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. గవర్నర్ కోష్యారిని ప్రతిపక్షాలు విమర్శించాయి. బీజేపీ వ్యక్తిగా గవర్నర్ వ్యాఖ్యలు చేశారంటూ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. గవర్నర్ మరాఠా ప్రజలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ కోష్యారీ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఇవి గవర్నర్ వ్యక్తిగత వ్యాఖ్యలు అంటూ వీటిని సమర్థించబోనని సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించారు. మరాఠీ వ్యక్తి అవమానానికి గురువుతున్నాడంటూ.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ః
Read Also: Petrol- Diesel Sales: జూలైలో తగ్గిన పెట్రోల్, డిజిల్ అమ్మకాలు.. పెరిగిన వంట గ్యాస్ వినియోగం
Also Read
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇదిలా ఉంటే సోమవారం తన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి. ఈ మేరకు గవర్నర్ ఆఫీస్ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. జూలై 29న జరిగిన ఓ పబ్లిక్ ఫంక్షన్ లో ముంబై అభివృద్ధిపై కొన్ని సంఘాలు చేసిన సహకారాన్ని ప్రశంసించే సమయంలో నేను తప్పుగా వ్యాఖ్యలు చేశానని.. మహారాష్ట్రలోనే కాదు మొత్తం భారతదేశంలో ప్రతీ ఒక్కరి సహకారం ఉందని ఆయన అన్నారు. గత మూడు సంవత్సరాలుగా మహారాష్ట్ర ప్రజల నుంచి నేను అపారమైన ప్రేమ పొందానని గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, మరాఠీ భాషల గౌరవాన్ని పెంచే విధంగా నా వంతు ప్రయత్నం చేశానని అన్నారు. ప్రసంగంలో పొరపాటున తప్పుచేసినట్లు అయితే… అది మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రాన్ని ధిక్కరించినట్లు భావించలేదనని తెలిపారు. వినయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలు రాష్ట్ర సేవకుడిని క్షమించాలని కోరారు.
తాజావార్తలు
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!