Bhagat Singh Koshyari: గుజరాతీ-రాజస్థానీ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన మహారాష్ట్ర గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor bhagat singh koshyari Apologises For Gujaratis-Rajasthanis comments: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో గుజరాతీలు, రాజస్థానీలు థానే, ముంబై, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే ఇక్కడ డబ్బులు మిగలవని.. ఇక ముంబై ఆర్థిక రాజధానిగా ఉండబోదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. గవర్నర్ కోష్యారిని ప్రతిపక్షాలు విమర్శించాయి. బీజేపీ వ్యక్తిగా గవర్నర్ వ్యాఖ్యలు చేశారంటూ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. గవర్నర్ మరాఠా ప్రజలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ కోష్యారీ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఇవి గవర్నర్ వ్యక్తిగత వ్యాఖ్యలు అంటూ వీటిని సమర్థించబోనని సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించారు. మరాఠీ వ్యక్తి అవమానానికి గురువుతున్నాడంటూ.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ః
Read Also: Petrol- Diesel Sales: జూలైలో తగ్గిన పెట్రోల్, డిజిల్ అమ్మకాలు.. పెరిగిన వంట గ్యాస్ వినియోగం
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ఇదిలా ఉంటే సోమవారం తన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి. ఈ మేరకు గవర్నర్ ఆఫీస్ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. జూలై 29న జరిగిన ఓ పబ్లిక్ ఫంక్షన్ లో ముంబై అభివృద్ధిపై కొన్ని సంఘాలు చేసిన సహకారాన్ని ప్రశంసించే సమయంలో నేను తప్పుగా వ్యాఖ్యలు చేశానని.. మహారాష్ట్రలోనే కాదు మొత్తం భారతదేశంలో ప్రతీ ఒక్కరి సహకారం ఉందని ఆయన అన్నారు. గత మూడు సంవత్సరాలుగా మహారాష్ట్ర ప్రజల నుంచి నేను అపారమైన ప్రేమ పొందానని గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, మరాఠీ భాషల గౌరవాన్ని పెంచే విధంగా నా వంతు ప్రయత్నం చేశానని అన్నారు. ప్రసంగంలో పొరపాటున తప్పుచేసినట్లు అయితే… అది మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రాన్ని ధిక్కరించినట్లు భావించలేదనని తెలిపారు. వినయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలు రాష్ట్ర సేవకుడిని క్షమించాలని కోరారు.
తాజావార్తలు
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!