Bhagat Singh Koshyari: గుజరాతీ-రాజస్థానీ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన మహారాష్ట్ర గవర్నర్
Governor bhagat singh koshyari Apologises For Gujaratis-Rajasthanis comments: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో గుజరాతీలు, రాజస్థానీలు థానే, ముంబై, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే ఇక్కడ డబ్బులు మిగలవని.. ఇక ముంబై ఆర్థిక రాజధానిగా ఉండబోదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. గవర్నర్ కోష్యారిని ప్రతిపక్షాలు విమర్శించాయి. బీజేపీ వ్యక్తిగా గవర్నర్ వ్యాఖ్యలు చేశారంటూ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. గవర్నర్ మరాఠా ప్రజలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ కోష్యారీ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఇవి గవర్నర్ వ్యక్తిగత వ్యాఖ్యలు అంటూ వీటిని సమర్థించబోనని సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించారు. మరాఠీ వ్యక్తి అవమానానికి గురువుతున్నాడంటూ.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ః
Read Also: Petrol- Diesel Sales: జూలైలో తగ్గిన పెట్రోల్, డిజిల్ అమ్మకాలు.. పెరిగిన వంట గ్యాస్ వినియోగం
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ఇదిలా ఉంటే సోమవారం తన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి. ఈ మేరకు గవర్నర్ ఆఫీస్ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. జూలై 29న జరిగిన ఓ పబ్లిక్ ఫంక్షన్ లో ముంబై అభివృద్ధిపై కొన్ని సంఘాలు చేసిన సహకారాన్ని ప్రశంసించే సమయంలో నేను తప్పుగా వ్యాఖ్యలు చేశానని.. మహారాష్ట్రలోనే కాదు మొత్తం భారతదేశంలో ప్రతీ ఒక్కరి సహకారం ఉందని ఆయన అన్నారు. గత మూడు సంవత్సరాలుగా మహారాష్ట్ర ప్రజల నుంచి నేను అపారమైన ప్రేమ పొందానని గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, మరాఠీ భాషల గౌరవాన్ని పెంచే విధంగా నా వంతు ప్రయత్నం చేశానని అన్నారు. ప్రసంగంలో పొరపాటున తప్పుచేసినట్లు అయితే… అది మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రాన్ని ధిక్కరించినట్లు భావించలేదనని తెలిపారు. వినయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలు రాష్ట్ర సేవకుడిని క్షమించాలని కోరారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో