Bengaluru: నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు.. స్కూళ్లకు సెలవులు
- నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు
- స్కూళ్లకు సెలవులు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్, ఆర్జీఏ టెక్ పార్క్ ఎదురుగా ఉన్న జంక్షన్ భారీ వర్షం కారణంగా జలమయమైంది. నీళ్లు నిలిచిపోవడంతో సాప్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వర్క్ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా బుధవారం బెంగళూరులోని అన్ని పాఠశాలలకు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేయడం మత భావాలను దెబ్బతీయదు..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
టెక్నాలజీ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్ అక్టోబర్ 15న (మంగళవారం) కురిసిన భారీ వర్షం కారణంగా భారీగా జలమయమైంది. అలాగే నాగవారలోని మాన్యతా టెక్ పార్క్లోని రోడ్లపై వరద నీరు చేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా టెక్ పార్క్ సమీపంలోని నాగవార ఫ్లైఓవర్ కూడా జలమయమైంది. మాన్యతా టెక్ పార్క్లోని చాలా కంపెనీలు టెక్ పార్క్ లోపల, వెలుపల నీటితో నిండి ఉన్నాయి. దీంతో రోడ్లు క్లియర్ అయ్యే వరకు కార్యాలయంలోనే ఉండాలని ఉద్యోగులకు ఆదేశించాయి. టెక్ పార్క్ సమీపంలో ఒక చెట్టును నేలకూల్చారు. ఇక బుధవారం కూడా భారీ వర్షాలు కారణంగా కొన్ని కంపెనీలు అక్టోబర్ 16న ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ఆదేశించాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్జిఎ టెక్ పార్క్ సమీపంలోని జంక్షన్, సర్జాపూర్ రోడ్లోని విప్రో గేట్, అలాగే ఐటీపీఎల్లోని హూడి సమీపంలోని ప్రాంతాలు, ఎలక్ట్రానిక్స్ సిటీలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద ముంపులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Rain Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం
ఔటర్ రింగ్ రోడ్డు, తుమకూరు రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్తో సహా ప్రధాన రహదారులపై గ్రిడ్లాక్లు ఉన్నాయని.. దీంతో చాలా మంది వాహనదారులు, పాఠశాల బస్సులు నిలిచిపోయాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బెంగళూరులోని అన్ని పాఠశాలలకు బుధవారం బెంగళూరు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు. అయితే కాలేజీలు తెరిచి ఉంటాయని చెప్పారు. ఇక అక్టోబరు 16న చిన్నస్వామి స్టేడియంలో జరిగే భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్పై వర్షం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. వర్షం కారణంగా మంగళవారం ఇరు జట్లు ప్రాక్టీస్ను రద్దు చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan: కమ్రాన్ గులామ్ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ.. బాబర్ అజామ్ పై ట్రోల్స్
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!