Bengaluru: నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు.. స్కూళ్లకు సెలవులు
- నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు
- స్కూళ్లకు సెలవులు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్, ఆర్జీఏ టెక్ పార్క్ ఎదురుగా ఉన్న జంక్షన్ భారీ వర్షం కారణంగా జలమయమైంది. నీళ్లు నిలిచిపోవడంతో సాప్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వర్క్ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా బుధవారం బెంగళూరులోని అన్ని పాఠశాలలకు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేయడం మత భావాలను దెబ్బతీయదు..
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
టెక్నాలజీ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్ అక్టోబర్ 15న (మంగళవారం) కురిసిన భారీ వర్షం కారణంగా భారీగా జలమయమైంది. అలాగే నాగవారలోని మాన్యతా టెక్ పార్క్లోని రోడ్లపై వరద నీరు చేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా టెక్ పార్క్ సమీపంలోని నాగవార ఫ్లైఓవర్ కూడా జలమయమైంది. మాన్యతా టెక్ పార్క్లోని చాలా కంపెనీలు టెక్ పార్క్ లోపల, వెలుపల నీటితో నిండి ఉన్నాయి. దీంతో రోడ్లు క్లియర్ అయ్యే వరకు కార్యాలయంలోనే ఉండాలని ఉద్యోగులకు ఆదేశించాయి. టెక్ పార్క్ సమీపంలో ఒక చెట్టును నేలకూల్చారు. ఇక బుధవారం కూడా భారీ వర్షాలు కారణంగా కొన్ని కంపెనీలు అక్టోబర్ 16న ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ఆదేశించాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్జిఎ టెక్ పార్క్ సమీపంలోని జంక్షన్, సర్జాపూర్ రోడ్లోని విప్రో గేట్, అలాగే ఐటీపీఎల్లోని హూడి సమీపంలోని ప్రాంతాలు, ఎలక్ట్రానిక్స్ సిటీలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద ముంపులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Rain Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం
ఔటర్ రింగ్ రోడ్డు, తుమకూరు రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్తో సహా ప్రధాన రహదారులపై గ్రిడ్లాక్లు ఉన్నాయని.. దీంతో చాలా మంది వాహనదారులు, పాఠశాల బస్సులు నిలిచిపోయాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బెంగళూరులోని అన్ని పాఠశాలలకు బుధవారం బెంగళూరు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు. అయితే కాలేజీలు తెరిచి ఉంటాయని చెప్పారు. ఇక అక్టోబరు 16న చిన్నస్వామి స్టేడియంలో జరిగే భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్పై వర్షం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. వర్షం కారణంగా మంగళవారం ఇరు జట్లు ప్రాక్టీస్ను రద్దు చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan: కమ్రాన్ గులామ్ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ.. బాబర్ అజామ్ పై ట్రోల్స్
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!