Bengaluru: నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు.. స్కూళ్లకు సెలవులు
- నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు
- స్కూళ్లకు సెలవులు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్, ఆర్జీఏ టెక్ పార్క్ ఎదురుగా ఉన్న జంక్షన్ భారీ వర్షం కారణంగా జలమయమైంది. నీళ్లు నిలిచిపోవడంతో సాప్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వర్క్ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా బుధవారం బెంగళూరులోని అన్ని పాఠశాలలకు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేయడం మత భావాలను దెబ్బతీయదు..
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
టెక్నాలజీ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్ అక్టోబర్ 15న (మంగళవారం) కురిసిన భారీ వర్షం కారణంగా భారీగా జలమయమైంది. అలాగే నాగవారలోని మాన్యతా టెక్ పార్క్లోని రోడ్లపై వరద నీరు చేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా టెక్ పార్క్ సమీపంలోని నాగవార ఫ్లైఓవర్ కూడా జలమయమైంది. మాన్యతా టెక్ పార్క్లోని చాలా కంపెనీలు టెక్ పార్క్ లోపల, వెలుపల నీటితో నిండి ఉన్నాయి. దీంతో రోడ్లు క్లియర్ అయ్యే వరకు కార్యాలయంలోనే ఉండాలని ఉద్యోగులకు ఆదేశించాయి. టెక్ పార్క్ సమీపంలో ఒక చెట్టును నేలకూల్చారు. ఇక బుధవారం కూడా భారీ వర్షాలు కారణంగా కొన్ని కంపెనీలు అక్టోబర్ 16న ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ఆదేశించాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్జిఎ టెక్ పార్క్ సమీపంలోని జంక్షన్, సర్జాపూర్ రోడ్లోని విప్రో గేట్, అలాగే ఐటీపీఎల్లోని హూడి సమీపంలోని ప్రాంతాలు, ఎలక్ట్రానిక్స్ సిటీలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద ముంపులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Rain Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం
ఔటర్ రింగ్ రోడ్డు, తుమకూరు రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్తో సహా ప్రధాన రహదారులపై గ్రిడ్లాక్లు ఉన్నాయని.. దీంతో చాలా మంది వాహనదారులు, పాఠశాల బస్సులు నిలిచిపోయాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బెంగళూరులోని అన్ని పాఠశాలలకు బుధవారం బెంగళూరు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు. అయితే కాలేజీలు తెరిచి ఉంటాయని చెప్పారు. ఇక అక్టోబరు 16న చిన్నస్వామి స్టేడియంలో జరిగే భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్పై వర్షం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. వర్షం కారణంగా మంగళవారం ఇరు జట్లు ప్రాక్టీస్ను రద్దు చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan: కమ్రాన్ గులామ్ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ.. బాబర్ అజామ్ పై ట్రోల్స్
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..