Bengaluru: నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు.. స్కూళ్లకు సెలవులు
- నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు
- స్కూళ్లకు సెలవులు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్, ఆర్జీఏ టెక్ పార్క్ ఎదురుగా ఉన్న జంక్షన్ భారీ వర్షం కారణంగా జలమయమైంది. నీళ్లు నిలిచిపోవడంతో సాప్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వర్క్ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా బుధవారం బెంగళూరులోని అన్ని పాఠశాలలకు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేయడం మత భావాలను దెబ్బతీయదు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
టెక్నాలజీ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్ అక్టోబర్ 15న (మంగళవారం) కురిసిన భారీ వర్షం కారణంగా భారీగా జలమయమైంది. అలాగే నాగవారలోని మాన్యతా టెక్ పార్క్లోని రోడ్లపై వరద నీరు చేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా టెక్ పార్క్ సమీపంలోని నాగవార ఫ్లైఓవర్ కూడా జలమయమైంది. మాన్యతా టెక్ పార్క్లోని చాలా కంపెనీలు టెక్ పార్క్ లోపల, వెలుపల నీటితో నిండి ఉన్నాయి. దీంతో రోడ్లు క్లియర్ అయ్యే వరకు కార్యాలయంలోనే ఉండాలని ఉద్యోగులకు ఆదేశించాయి. టెక్ పార్క్ సమీపంలో ఒక చెట్టును నేలకూల్చారు. ఇక బుధవారం కూడా భారీ వర్షాలు కారణంగా కొన్ని కంపెనీలు అక్టోబర్ 16న ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ఆదేశించాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్జిఎ టెక్ పార్క్ సమీపంలోని జంక్షన్, సర్జాపూర్ రోడ్లోని విప్రో గేట్, అలాగే ఐటీపీఎల్లోని హూడి సమీపంలోని ప్రాంతాలు, ఎలక్ట్రానిక్స్ సిటీలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద ముంపులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Rain Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం
ఔటర్ రింగ్ రోడ్డు, తుమకూరు రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్తో సహా ప్రధాన రహదారులపై గ్రిడ్లాక్లు ఉన్నాయని.. దీంతో చాలా మంది వాహనదారులు, పాఠశాల బస్సులు నిలిచిపోయాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బెంగళూరులోని అన్ని పాఠశాలలకు బుధవారం బెంగళూరు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు. అయితే కాలేజీలు తెరిచి ఉంటాయని చెప్పారు. ఇక అక్టోబరు 16న చిన్నస్వామి స్టేడియంలో జరిగే భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్పై వర్షం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. వర్షం కారణంగా మంగళవారం ఇరు జట్లు ప్రాక్టీస్ను రద్దు చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan: కమ్రాన్ గులామ్ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ.. బాబర్ అజామ్ పై ట్రోల్స్
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!