Bengaluru: నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు.. స్కూళ్లకు సెలవులు
- నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు
- స్కూళ్లకు సెలవులు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్, ఆర్జీఏ టెక్ పార్క్ ఎదురుగా ఉన్న జంక్షన్ భారీ వర్షం కారణంగా జలమయమైంది. నీళ్లు నిలిచిపోవడంతో సాప్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వర్క్ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా బుధవారం బెంగళూరులోని అన్ని పాఠశాలలకు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేయడం మత భావాలను దెబ్బతీయదు..
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
టెక్నాలజీ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్ అక్టోబర్ 15న (మంగళవారం) కురిసిన భారీ వర్షం కారణంగా భారీగా జలమయమైంది. అలాగే నాగవారలోని మాన్యతా టెక్ పార్క్లోని రోడ్లపై వరద నీరు చేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా టెక్ పార్క్ సమీపంలోని నాగవార ఫ్లైఓవర్ కూడా జలమయమైంది. మాన్యతా టెక్ పార్క్లోని చాలా కంపెనీలు టెక్ పార్క్ లోపల, వెలుపల నీటితో నిండి ఉన్నాయి. దీంతో రోడ్లు క్లియర్ అయ్యే వరకు కార్యాలయంలోనే ఉండాలని ఉద్యోగులకు ఆదేశించాయి. టెక్ పార్క్ సమీపంలో ఒక చెట్టును నేలకూల్చారు. ఇక బుధవారం కూడా భారీ వర్షాలు కారణంగా కొన్ని కంపెనీలు అక్టోబర్ 16న ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ఆదేశించాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్జిఎ టెక్ పార్క్ సమీపంలోని జంక్షన్, సర్జాపూర్ రోడ్లోని విప్రో గేట్, అలాగే ఐటీపీఎల్లోని హూడి సమీపంలోని ప్రాంతాలు, ఎలక్ట్రానిక్స్ సిటీలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద ముంపులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Rain Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం
ఔటర్ రింగ్ రోడ్డు, తుమకూరు రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్తో సహా ప్రధాన రహదారులపై గ్రిడ్లాక్లు ఉన్నాయని.. దీంతో చాలా మంది వాహనదారులు, పాఠశాల బస్సులు నిలిచిపోయాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బెంగళూరులోని అన్ని పాఠశాలలకు బుధవారం బెంగళూరు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు. అయితే కాలేజీలు తెరిచి ఉంటాయని చెప్పారు. ఇక అక్టోబరు 16న చిన్నస్వామి స్టేడియంలో జరిగే భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్పై వర్షం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. వర్షం కారణంగా మంగళవారం ఇరు జట్లు ప్రాక్టీస్ను రద్దు చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan: కమ్రాన్ గులామ్ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ.. బాబర్ అజామ్ పై ట్రోల్స్
తాజావార్తలు
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..