Pakistan: కమ్రాన్ గులామ్ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ.. బాబర్ అజామ్ పై ట్రోల్స్
- టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన మ్యాచ్లో సెంచరీ సాధించిన కమ్రాన్ గులామ్
- 29 ఏళ్లు నిండిన కమ్రాన్ గులామ్
- అరంగేట్రం టెస్టు మ్యాచ్లోనే సెంచరీ సాధించిన 13వ పాక్ క్రికెటర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లోని రెండో మ్యాచ్లో పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2024 అక్టోబర్ 10న అతనికి 29 ఏళ్లు నిండాయి. కాగా.. గులామ్ తన అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. అరంగేట్రం టెస్టు మ్యాచ్లోనే సెంచరీ సాధించిన 13వ పాక్ క్రికెటర్గా నిలిచాడు. అయితే.. అరంగేట్రం టెస్టు మ్యాచ్లో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద పాకిస్థానీగా గులామ్ ఉన్నాడు. అబిద్ అలీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అబిద్ అలీ 2019 డిసెంబర్ 15న రావల్పిండిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అప్పటికి అతని వయసు 32 ఏళ్ల 2 నెలలు. కమ్రాన్ గులామ్ తన అద్భుతమైన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. కమ్రాన్ గులామ్ తన ఇన్నింగ్స్లో 224 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 118 పరుగులు చేశాడు.
Rain Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
కమ్రాన్ గులామ్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో (16 ఫస్ట్క్లాస్ సెంచరీలు) తన సత్తాను నిరూపించుకున్నాడు. ఈ సెంచరీ తర్వాత, సోషల్ మీడియా వినియోగదారులు గులామ్ను ప్రశంసిస్తున్నారు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. బాబర్ ఆజం తనకు వచ్చిన అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ క్రికెట్లోని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరైన బాబర్ ఆజం స్థానంలో ఎంపికైన కమ్రాన్ గులామ్ వచ్చిన వెంటనే సెంచరీ సాధించాడు. దీంతో సెలక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.’ అని తెలిపారు.
Hoax bomb threats: ఢిల్లీ-చికాగో ఎయిరిండియాతో సహా 5 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు..
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ని రెండో, మూడో టెస్టు మ్యాచ్ల జట్టు నుంచి తప్పించారు. బాబర్ ఆజం గత రెండేళ్లలో టెస్టు క్రికెట్లో ఒక్క సెంచరీ, అర్ధ సెంచరీ కూడా సాధించలేదు. కాగా.. రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 5 వికెట్లకు 259 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 37 పరుగులతో, సల్మాన్ అఘా 5 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం కమ్రాన్ గులామ్ మాట్లాడుతూ.. ‘దేశవాళీ క్రికెట్లో నేను చాలా కష్టపడ్డాను. నాకు అవకాశం అంత తేలికగా రాలేదు. ఈ రోజు నేను బాబర్ ఆజం లాంటి లెజెండ్ని భర్తీ చేశాను. ఇంత మంచి ఆటగాడిని భర్తీ చేసినప్పుడు, నేను మంచి ప్రదర్శన చేయాలని అనుకున్నాను.’ అని కమ్రాన్ గులామ్ తెలిపాడు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!