Pakistan: కమ్రాన్ గులామ్ అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ.. బాబర్ అజామ్ పై ట్రోల్స్
- టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన మ్యాచ్లో సెంచరీ సాధించిన కమ్రాన్ గులామ్
- 29 ఏళ్లు నిండిన కమ్రాన్ గులామ్
- అరంగేట్రం టెస్టు మ్యాచ్లోనే సెంచరీ సాధించిన 13వ పాక్ క్రికెటర్.
ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లోని రెండో మ్యాచ్లో పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2024 అక్టోబర్ 10న అతనికి 29 ఏళ్లు నిండాయి. కాగా.. గులామ్ తన అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. అరంగేట్రం టెస్టు మ్యాచ్లోనే సెంచరీ సాధించిన 13వ పాక్ క్రికెటర్గా నిలిచాడు. అయితే.. అరంగేట్రం టెస్టు మ్యాచ్లో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద పాకిస్థానీగా గులామ్ ఉన్నాడు. అబిద్ అలీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అబిద్ అలీ 2019 డిసెంబర్ 15న రావల్పిండిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అప్పటికి అతని వయసు 32 ఏళ్ల 2 నెలలు. కమ్రాన్ గులామ్ తన అద్భుతమైన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. కమ్రాన్ గులామ్ తన ఇన్నింగ్స్లో 224 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 118 పరుగులు చేశాడు.
Rain Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
కమ్రాన్ గులామ్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో (16 ఫస్ట్క్లాస్ సెంచరీలు) తన సత్తాను నిరూపించుకున్నాడు. ఈ సెంచరీ తర్వాత, సోషల్ మీడియా వినియోగదారులు గులామ్ను ప్రశంసిస్తున్నారు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. బాబర్ ఆజం తనకు వచ్చిన అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ క్రికెట్లోని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరైన బాబర్ ఆజం స్థానంలో ఎంపికైన కమ్రాన్ గులామ్ వచ్చిన వెంటనే సెంచరీ సాధించాడు. దీంతో సెలక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.’ అని తెలిపారు.
Hoax bomb threats: ఢిల్లీ-చికాగో ఎయిరిండియాతో సహా 5 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు..
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ని రెండో, మూడో టెస్టు మ్యాచ్ల జట్టు నుంచి తప్పించారు. బాబర్ ఆజం గత రెండేళ్లలో టెస్టు క్రికెట్లో ఒక్క సెంచరీ, అర్ధ సెంచరీ కూడా సాధించలేదు. కాగా.. రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 5 వికెట్లకు 259 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 37 పరుగులతో, సల్మాన్ అఘా 5 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం కమ్రాన్ గులామ్ మాట్లాడుతూ.. ‘దేశవాళీ క్రికెట్లో నేను చాలా కష్టపడ్డాను. నాకు అవకాశం అంత తేలికగా రాలేదు. ఈ రోజు నేను బాబర్ ఆజం లాంటి లెజెండ్ని భర్తీ చేశాను. ఇంత మంచి ఆటగాడిని భర్తీ చేసినప్పుడు, నేను మంచి ప్రదర్శన చేయాలని అనుకున్నాను.’ అని కమ్రాన్ గులామ్ తెలిపాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!