Mamata Banerjee: మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ పరువు నష్టం కేసు..
- సీఎం మమతా బెనర్జీపై గవర్నర్ పరువు నష్టం కేసు..
- ఇటీవల గవర్నర్ని ఉద్దేశించి మమత వ్యాఖ్యలు..
- పలువురు టీఎంసీ నేతలపై కూడా కేసు నమోదు..
- బెంగాల్లో గవర్నర్ వర్సెస్ సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం ఎదురైంది. గవర్నర్ సీవి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. సీఎంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలపై గవర్నర్ శుక్రవారం కలకత్తా హైకోర్టులో కేసు వేశారు. రాజ్భవన్లో జరుగుతున్న కార్యక్రమాల వల్ల మహిళలు అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నారని మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ పరిణామం ఎదురైంది. గవర్నర్ ఆమె వ్యాఖ్యల్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యాఖ్యలే చేసిన కొంతమంది టీఎంసీ నేతలపై గవర్నర్ పరువు నష్టం కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Read Also: Congress: కొలిక్కిరాని పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ.. మరోసారి హస్తినకు..
Also Read
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
గురువారం సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల సంఘటనల కారణంగా రాజ్భవన్ వెళ్లేందుకు భయపడుతున్నామని మహిళలను నాకు చెప్పారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ శుక్రవారం కలకత్తా హైకోర్టుని ఆశ్రయించినట్లు, సీఎంతో పాటు పలువురు టీఎంసీ నేతలపై పరువు నష్టం కేసు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
అయితే, ఈ కేసును గురించి టీఎంసీ రాజ్యసభ ఎంపీ డోలా సెన్ని సంప్రదించినప్పుడు, పార్టీ నాయకత్వంతో చర్చించకుండా ఈ విషయంపై తాను వ్యాఖ్యానించలేనని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పార్టీ నాయకత్వంతో మాట్లాడుతానని అన్నారు. మరోవైపు గవర్నర్ మంచి నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు. అయితే, చాలా కాలం క్రితమే అతనను ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందని చెప్పారు. సీఎం, గవర్నర్ మధ్య వైరం రాష్ట్రానికి ఉపయోగపడటం లేదని సీపీఎం సీనియర్ నేత సుజన్ చక్రవర్తి అన్నారు.
తాజావార్తలు
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!