Mamata Banerjee: మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ పరువు నష్టం కేసు..
- సీఎం మమతా బెనర్జీపై గవర్నర్ పరువు నష్టం కేసు..
- ఇటీవల గవర్నర్ని ఉద్దేశించి మమత వ్యాఖ్యలు..
- పలువురు టీఎంసీ నేతలపై కూడా కేసు నమోదు..
- బెంగాల్లో గవర్నర్ వర్సెస్ సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం ఎదురైంది. గవర్నర్ సీవి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. సీఎంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలపై గవర్నర్ శుక్రవారం కలకత్తా హైకోర్టులో కేసు వేశారు. రాజ్భవన్లో జరుగుతున్న కార్యక్రమాల వల్ల మహిళలు అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నారని మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ పరిణామం ఎదురైంది. గవర్నర్ ఆమె వ్యాఖ్యల్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యాఖ్యలే చేసిన కొంతమంది టీఎంసీ నేతలపై గవర్నర్ పరువు నష్టం కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Read Also: Congress: కొలిక్కిరాని పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ.. మరోసారి హస్తినకు..
Also Read
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
గురువారం సెక్రటేరియట్లో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల సంఘటనల కారణంగా రాజ్భవన్ వెళ్లేందుకు భయపడుతున్నామని మహిళలను నాకు చెప్పారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ శుక్రవారం కలకత్తా హైకోర్టుని ఆశ్రయించినట్లు, సీఎంతో పాటు పలువురు టీఎంసీ నేతలపై పరువు నష్టం కేసు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
అయితే, ఈ కేసును గురించి టీఎంసీ రాజ్యసభ ఎంపీ డోలా సెన్ని సంప్రదించినప్పుడు, పార్టీ నాయకత్వంతో చర్చించకుండా ఈ విషయంపై తాను వ్యాఖ్యానించలేనని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పార్టీ నాయకత్వంతో మాట్లాడుతానని అన్నారు. మరోవైపు గవర్నర్ మంచి నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు. అయితే, చాలా కాలం క్రితమే అతనను ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందని చెప్పారు. సీఎం, గవర్నర్ మధ్య వైరం రాష్ట్రానికి ఉపయోగపడటం లేదని సీపీఎం సీనియర్ నేత సుజన్ చక్రవర్తి అన్నారు.
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!