Kerala High Court: ఆస్పత్రులు ‘‘ఆధునిక సమాజంలో దేవాలయాలు’’.. దాడులు చేస్తే సహించొద్దు..
- ఆస్పత్రులు ఆధునిక సమాజంలో దేవాలయాలు..
- దాడులు చేస్తే చట్టం కఠినంగా వ్యవహరించాలి..
- కొన్ని సందర్భాల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్న మాట వాస్తవమే..
- అంతమాత్రాన ఆస్పత్రి భవనాలు, సదుపాయాలపై దాడులు చేయలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala High Court: ఆసుపత్రులు “ఆధునిక సమాజంలోని దేవాలయాలు” అని, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా విధ్వంసం నుండి రక్షించబడాలని కేరళ హైకోర్టు నొక్కి చెప్పింది. డిసెంబర్ 07న కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయుర్వేద ఆస్పత్రి ధ్వంసం చేసి, రూ. 10,000 నష్టానికి కారణమైన కేసులో నిందితుడైన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
బెయిల్ షరతుల్లో భాగంగా, నిందితుడు కోర్టుకు రూ. 10,000 డిపాజిట్ చేయాలని, ఒక వేళ నిర్దోషిగా తేలితే ఆ డబ్బులను తిరిగి పొందుతాడని, నేరం రుజువైతే ఈ మొత్తాన్ని ఆస్పత్రికి జరిగిన నష్టాన్ని భర్త ఉపయోగించబడుతుందని కోర్టు తెలిపింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేయడానికి ఇలాంటి షరతులను చేర్చేందుకు రాష్ట్ర శాసనసభ ‘‘కేరళ హెల్త్కేర్ సర్వీస్ పర్సన్స్ అండ్ హెల్త్కేర్ ఇన్స్టిట్యూషన్స్ (హింస నిరోధం మరియు ఆస్తులకు నష్టం) చట్టం, 2012’’లో సవరణలు చేయాలని జస్టిస్ కున్హికృష్ణన్ సూచించారు.
Also Read
- Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
Read Also: Violence against Hindus: పాకిస్తాన్లో కన్నా బంగ్లాదేశ్లోనే హిందువులపై ఎక్కువ దాడులు..
ఆస్పత్రులు కేవలం భవనాలు మాత్రమే కాదని, అవి ఆశకి, స్వస్థతకు చిహ్నాలని హైకోర్టు పేర్కొంది. అలాంటి ప్రదేశాల్లో ఏదైనా విధ్వంసం జరిగితే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని కోర్టు పేర్కొంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదా దుష్ప్రవర్తన కారణంగా ఆస్పత్రుల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని హైకోర్టు అంగీకరించింది. ‘‘అంత మాత్రాన ఆస్పత్రి భవనం లేదా సామాగ్రిని నాశనం చేయలేమని చెప్పింది.
‘‘ఆసుపత్రులు ఆధునిక సమాజంలోని దేవాలయాలు, ఇక్కడికి ప్రజలు ఆరోగ్యం, శ్రేయస్సు కోసం దేవతలను ఆరాధించడానికి వెళతారు. అందువల్ల ఆసుపత్రులలో ఏదైనా విధ్వంసాన్ని చట్టం యొక్క ఉక్కు హస్తాలను ఉపయోగించి నివారించాలి.’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో పాటు హైకోర్టు తన ఆదేశాల కాపీని కేరళ సీఎస్కి పంపాలని ఆదేశించడంతో పాటు ప్రభుత్వం తమ సూచనలకు అనుగుణంగా 2012 చట్టానికి సవరణలు చేయాలని కోరింది.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!