Kerala High Court: ఆస్పత్రులు ‘‘ఆధునిక సమాజంలో దేవాలయాలు’’.. దాడులు చేస్తే సహించొద్దు..
- ఆస్పత్రులు ఆధునిక సమాజంలో దేవాలయాలు..
- దాడులు చేస్తే చట్టం కఠినంగా వ్యవహరించాలి..
- కొన్ని సందర్భాల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్న మాట వాస్తవమే..
- అంతమాత్రాన ఆస్పత్రి భవనాలు, సదుపాయాలపై దాడులు చేయలేం..
Kerala High Court: ఆసుపత్రులు “ఆధునిక సమాజంలోని దేవాలయాలు” అని, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా విధ్వంసం నుండి రక్షించబడాలని కేరళ హైకోర్టు నొక్కి చెప్పింది. డిసెంబర్ 07న కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయుర్వేద ఆస్పత్రి ధ్వంసం చేసి, రూ. 10,000 నష్టానికి కారణమైన కేసులో నిందితుడైన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
బెయిల్ షరతుల్లో భాగంగా, నిందితుడు కోర్టుకు రూ. 10,000 డిపాజిట్ చేయాలని, ఒక వేళ నిర్దోషిగా తేలితే ఆ డబ్బులను తిరిగి పొందుతాడని, నేరం రుజువైతే ఈ మొత్తాన్ని ఆస్పత్రికి జరిగిన నష్టాన్ని భర్త ఉపయోగించబడుతుందని కోర్టు తెలిపింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేయడానికి ఇలాంటి షరతులను చేర్చేందుకు రాష్ట్ర శాసనసభ ‘‘కేరళ హెల్త్కేర్ సర్వీస్ పర్సన్స్ అండ్ హెల్త్కేర్ ఇన్స్టిట్యూషన్స్ (హింస నిరోధం మరియు ఆస్తులకు నష్టం) చట్టం, 2012’’లో సవరణలు చేయాలని జస్టిస్ కున్హికృష్ణన్ సూచించారు.
Also Read
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
Read Also: Violence against Hindus: పాకిస్తాన్లో కన్నా బంగ్లాదేశ్లోనే హిందువులపై ఎక్కువ దాడులు..
ఆస్పత్రులు కేవలం భవనాలు మాత్రమే కాదని, అవి ఆశకి, స్వస్థతకు చిహ్నాలని హైకోర్టు పేర్కొంది. అలాంటి ప్రదేశాల్లో ఏదైనా విధ్వంసం జరిగితే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని కోర్టు పేర్కొంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదా దుష్ప్రవర్తన కారణంగా ఆస్పత్రుల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయని హైకోర్టు అంగీకరించింది. ‘‘అంత మాత్రాన ఆస్పత్రి భవనం లేదా సామాగ్రిని నాశనం చేయలేమని చెప్పింది.
‘‘ఆసుపత్రులు ఆధునిక సమాజంలోని దేవాలయాలు, ఇక్కడికి ప్రజలు ఆరోగ్యం, శ్రేయస్సు కోసం దేవతలను ఆరాధించడానికి వెళతారు. అందువల్ల ఆసుపత్రులలో ఏదైనా విధ్వంసాన్ని చట్టం యొక్క ఉక్కు హస్తాలను ఉపయోగించి నివారించాలి.’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో పాటు హైకోర్టు తన ఆదేశాల కాపీని కేరళ సీఎస్కి పంపాలని ఆదేశించడంతో పాటు ప్రభుత్వం తమ సూచనలకు అనుగుణంగా 2012 చట్టానికి సవరణలు చేయాలని కోరింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!