Bangladesh: భారత శత్రువులకు బంగ్లాదేశ్ ‘‘రెడ్ కార్పెట్’’.. జకీర్ నాయక్, హఫీస్ సయీద్, పాక్ ఆర్మీకి వెల్కమ్..
- భారత శత్రువులకు బంగ్లాదేశ్ ‘‘రెడ్ కార్పెట్’’ వెల్కమ్..
- జకీర్ నాయక్, పాక్ ఆర్మీ జనరల్, లష్కరే ఉగ్రవాదికి ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆడింది ఆటగా సాగుతోంది. బంగ్లాదేశ్ తీవ్ర భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది. భారత శత్రువులకు ‘‘రెడ్ కార్పెట్’’ ఆహ్వానం పలుకుతోంది. తాజాగా, ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ (LeT) హఫీజ్ సయీద్ సన్నిహితులు బంగ్లాదేశ్కు వెళ్లాడు. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ మర్కజీ జమియత్ అహ్ల్-ఎ-హదీత్ ప్రధాన కార్యదర్శి ఇబ్తిసం ఎలాహి జహీర్ అక్టోబర్ 25న ఢాకా చేరుకున్నారు. ఇతను భారత సరిహద్దు ప్రాంతంలో పర్యటించినట్లు సమాచారం.
గత రెండు రోజల్లో జహీర్ రాజ్షాహీ, చపైనావాబ్గంజ్ వంటి సరిహద్దు ప్రాంతాలను సందర్శించాడు. దీంతో పాటు భారత్ సరిహద్దుల్లోని రంగ్పూర్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ పాలకుడు అయిన తర్వాత జహీర్ రెండోసారి ఆ దేశంలో పర్యటిస్తున్నాడు. అంతకుముందు ఫిబ్రవరిలో జహీర్ బంగ్లా వెళ్లాడు. లష్కరే తోయిబా బంగ్లాదేశ్లో తన కార్యకలాపాలను మొదలుపెట్టాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. యూనస్ పదవీ లోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులైన జమాతే ఇస్లామీ, బీఎన్పీ వంటి సంస్థలు యాక్టివ్ అయ్యాయి.
Also Read
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
Read Also: Pulluri Prasad Rao : మావోయిస్టులకు మరో దెబ్బ.. డీజీపీ ముందు లొంగిపోనున్న కీలక నేతలు
ఇదిలా ఉంటే, ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆర్మీ టాప్ జనరల్స్లో ఒకరైన, పాక్ ఆర్మీ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా కూడా బంగ్లాదేశ్ వెళ్లాడు. ఏకంగా మహ్మద్ యూనస్తో భేటీ అయ్యాడు. ఆ సమయం యూనస్ మీర్జాకు ఒక పుస్తకాన్ని బహూకరించాడు. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పుస్తకంపై బంగ్లాదేశ్ మ్యాప్లో భారత ఈశాన్య రాష్ట్రాలను కూడా చేర్చినట్లు కనిపిస్తోంది.
మరోవైపు, భారత్ మోస్ట్ వాంటెంట్ జకీర్ నాయక్ను కూడా బంగ్లాదేశ్ స్వాగతిస్తోంది. విద్వేష ప్రసంగాలు, తీవ్రవాద భావజాలాన్ని పెంచి పోషించిన కేసుల్లో ఇతడిని భారతదేశం కోరుతోంది. ప్రస్తుతం, ఇతను మలేషియాలో ఆశ్రయం పొందుతున్నాడు. గతంలో పాకిస్తాన్ పర్యటనకు కూడా ఇతను వెళ్లి వచ్చాడు. 2016లో ఢాకా హోలీ ఆర్టిసన్ బేకరీ ఉగ్రవాద దాడి తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా, నాయక్ నిర్వహిస్తున్న పీస్ టీవీపై నిషేధం విధించింది. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది నయీక్ ప్రసంగాలతో ప్రేరణ పొందినట్లు చెప్పారు.
ప్రస్తుతం, భారత వ్యతిరేకులు అంతా బంగ్లాదేశ్లో ఏదో కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ, బంగ్లా ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ అయ్యాయి. ఐఎస్ఐ బంగ్లాదేశ్లో హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ, జామాత్ ఉల్ ముజాహిద్ బంగ్లాదేశ్ వంటి ఉగ్ర సంస్థలకు శిక్షణ ఇస్తోంది. జకీర్ నాయక్ పర్యటన ఈ గ్రూపులకు మద్దతు ఇస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!