India- Bangladesh: భారత్తో ఉన్న వాణిజ్య సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటాం..
- బంగ్లాదేశ్ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు..
- భారత్తో నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటాం..
- వాణిజ్య ప్రక్రియలో సమస్యలు ఉండటం సహజం: మహమ్మద్ యూనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- Bangladesh: బంగ్లాదేశ్ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఆ దేశ దిగుమతులపై అనేక పరిమితులను విధిస్తున్నట్లు పేర్కొనింది. ఈ నేపథ్యంలో భారత్తో నెలకొన్న వాణిజ్య సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ మీడియాతో వెల్లడించారు.
Read Also: Gulzar House: గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్..!
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
అయితే, భారత్ తీసుకున్న చర్యలకు సంబంధించి మాకు ఇంకా అధికారిక సమాచారం రాలేదని బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ తెలిపారు. సమాచారం అందిన తర్వాత చర్యలు తీసుకుంటాం అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో వాటిని పరిష్కరించుకునేలా ప్లాన్ చేస్తామన్నారు. అఖౌరా, డాగి పోర్టులతో పాటు కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి పలు నిర్ణయాలను భారత్ తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇది రెండు దేశాలకు మంచి విషయం.. వస్త్ర పరిశ్రమలో భారత్ మొదటి స్థానంలో ఉందని తాము భావిస్తున్నాం.. ఇప్పటికీ, ఆయా ఉత్పత్తులు మా దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. భారత్- బంగ్లాదేశ్ పొరుగు దేశాలు. సహజంగానే వాణిజ్యం, రవాణా లాంటి వాటిల్లో పోటీ అనేది ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు మేము ఆంక్షలు విధిస్తాం.. అలాగే భారత్ కూడా చేస్తోంది.. వాణిజ్య ప్రక్రియలో ఇది భాగం మాత్రమేనని తేల్చి చెప్పారు. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే రెండు దేశాలు పరిష్కారం చేసుకుంటాయని బషీరుద్దీన్ చెప్పారు.
Read Also: Gulzar House: గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్..!
ఇక, గత నెలలో భారత్ నుంచి వచ్చే వస్తువులపై బంగ్లాదేశ్ పరిమితులు విధించింది. దీనికి ప్రతిస్పందనగా.. ఇండియా అక్కడి నుంచి దిగుమతయ్యే రెడీమేడ్ దుస్తులు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్, పత్తి, నూలు వ్యర్థాలు, ప్లాస్టిక్, పీవీసీ వస్తువులు, కలప ఫర్నీచర్ తదితర అన్నింటిని ఆపేసింది. ఈ సరకులను కోల్కతా నౌకాశ్రయం, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయం నుంచి మాత్రమే భారత దేశంలోకి వస్తాయి. కానీ, బంగ్లా నుంచి దిగుమతి అయ్యే చేపలు, ఎల్పీజీ, వనస్పతి, కంకర లాంటి వాటికి ఈ ఆంక్షలు వర్తించవని భారత్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్లోకి స్వాగతం’ అంటూ..
-
Vaibhav Sooryavanshi: చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు!
-
EV Sales India 2026: ఈవీ అమ్మకాల జోరు.. మే నెలలో రికార్డు స్థాయిలో 150,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్..!
-
RCB Victory Celebrations: ఆర్సీబీ ఫ్యాన్స్కు షాక్.. విజయోత్సవ ర్యాలీపై ఫ్రాంచైజీ కీలక ప్రకటన..
-
Peddi Ticket Booking :”పెద్ది” ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… టికెట్ బుకింగ్స్ షురూ
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!