India Pak War: భారత్ పాకిస్తాన్పై విరుచుకుపడుతుంటే, బంగ్లాదేశ్లో భయం మొదలైంది..
- భారత్ పాకిస్తాన్పై తీసుకున్న చర్యలతో బంగ్లాదేశ్లో భయం..
- హిందువుల భద్రతకు కీలక ఆదేశాలు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pak War: పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలను, వాటి శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100కు మించి ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం, పాక్ భారత్పై దాడికి పాల్పడింది. దీని తర్వాత మరోసారి ఇండియా తన విశ్వరూపాన్ని చూపించింది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ ఇలా ప్రధాన నగరాలు బాంబు మోతలతో దద్దరిల్లాయి.
అయితే, ఈ పరిణామాలు బంగ్లాదేశ్లో భయాన్ని పుట్టిస్తున్నాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్ని తన పెద్దన్నగా భావిస్తోంది. భారత వ్యతిరేకంగా పాకిస్తాన్కి దగ్గరవుతూ వచ్చింది. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారుల్ని బంగ్లాదేశ్ ఆహ్వానించింది. రెండు దేశాలు వాణిజ్య, ఇతర సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావించాయి.
Also Read
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
- Akhil NRD: "ప్రేమ పెళ్లి".. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
Read Also: Nawaz Sharif: భారత్తో ఉద్రిక్తత.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ కీలక సలహా..
అయితే, ఇప్పుడు భారత్ దెబ్బకు పాకిస్తాన్ వణికిపోతుంది. పాక్ పరిస్థితి ఇలా ఉంటే భారత్తో పెట్టుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో అని బంగ్లాదేశ్ అనుకుందో ఏమో మార్పు కనిపిస్తోంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా బంగ్లాదేశ్ని వదిలి భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, బంగ్లా వ్యాప్తంగా హిందువులే టార్గెట్గా ఇళ్లు, ఆస్తులు, ఆలయాలు, వ్యాపారాలను మతోన్మాదులు టార్గెట్ చేశారు. భారత్ ఎన్ని సార్లు చెప్పినా, యూనస్ సర్కార్ అసలు హిందువుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు.
ఇప్పుడు యూనస్ సర్కార్ హిందూ కమ్యూనిటీ భద్రత కోసం స్థానిక పోలీసులు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్-పాక్ ఉద్రిక్తత ప్రభావం బంగ్లాదేశ్ హిందువులపై పడుతుందని యూనస్ సర్కార భయపడుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ఇండియా ఊరుకునే పరిస్థితి ఉండదని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏదైనా అల్లర్లను నివారించడానికి బంగ్లాదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయం (PHQ) బుధవారం ఒక లేఖను జారీ చేసింది, మైనారిటీల భద్రతను నిర్ధారించాలని పోలీసు విభాగాలను ఆదేశిస్తోంది. హిందువులకు భారీ భద్రత కల్పించాలని బంగ్లా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
సరిహద్దు ప్రాంతాలు మరియు సోషల్ మీడియాపై నిఘా ఉంచడం హిందువులను లక్ష్యంగా చేసుకుని హింస, అశాంతిని ప్రేరేపించకుండా నిరోధించడానికి సరిహద్దు ప్రాంతాలలో భద్రతను పెంచాలని అధికారులు ఆదేశించారు. మొబైల్ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ కార్యకలాపాలు, సోషల్ మీడియా ఖాతాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!