India Bangladesh: భారత్పై బంగ్లాదేశ్ కుట్ర.. సరిహద్దుల్లో హై అలర్ట్..
- భారత అస్థిరతకు కుట్ర పన్నుతున్న బంగ్లాదేశ్..
- సరిహద్దుల్లో అవాంఛిత కార్యక్రమాలకు ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకత పెరుగుతోంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ భారత్తో మెరుగైన సంబంధాలు కోరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన సర్కార్లోని విద్యార్థి నేతలు, జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీలకు చెందిన నేతలు మతోన్మాద వ్యాఖ్యలు చేస్తూ, అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. హిందువులు, భారత్కి వ్యతిరేకంగా ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ తనకు చేసిన అన్యాయాలను మరిచిపోయి పాకిస్తాన్తో స్నేహం చేస్తోంది.
Read Also: Allahabad HC: అత్యాచార బాధితురాలు గర్భాన్ని వద్దనుకునే హక్కు ఉంది..
Also Read
ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు కలిపి భారత్పై ఏదో కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాక్ ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన సమయంలో, భారత్ సరిహద్దుల్లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. తాజాగా జాగ్రన్ రిపోర్ట్ ప్రకారం, ఇటీవల ఏర్పడిన ‘‘బంగ్లాదేశ్ జనగన్’’ అనే సంస్థ, భారత్ సరిహద్దుల్లో అస్థిరతకు ప్లాన్ చేస్తోందని సమాచారం. సరిహద్దుల్లో వేలాది మంది చేరడం, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా సామూహికంగా ఆవుల్ని వధించడం, గొడ్డుమాంసం పంపిణీ కార్యక్రమాలను చేపడుతోంది. దీంతో మన కేంద్ర నిఘా సంస్థలు, బీఎస్ఎఫ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. సరిహద్దుల్లో భద్రతని పెంచాయి.
మరోవైపు మహ్మద్ యూనస్ ఏప్రిల్ 2-4 తేదీల్లో థాయిలాండ్లో జరిగే 6వ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC) శిఖరాగ్ర సమావేశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో సమావేశం జరుగుతుందని బంగ్లాదేశ్ ఆశ పడుతోంది. బిమ్స్టెక్ సదస్సు అవకాశంగా ఇద్దరు నేతలు కలిస అవకాశం ఉంది. అయితే,దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!