Suvendu Adhikari: బీజేపీ నేత సువేందు అధికారిపై దాడికి బంగ్లాదేశ్ టెర్రరిస్టు గ్రూపుల కుట్ర..
- బీజేపీ నేత సువేందు అధికారిపై బంగ్లా టెర్రర్ గ్రూపుల కుట్ర..
- దాడికి పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిక..
- భద్రతను పెంచాలని ఐబీ అధికారుల సూచన..
- బంగ్లాదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న అధికారి..
- హిందువుల అణిచివేతకు వ్యతిరేకంగా గళం..
Suvendu Adhikari: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్కి చెందిన ఒక ఇస్లామిక్ మతఛాందసవాద బృందం దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం.. బంగ్లాదేశ్కి చెందిన ఒక గ్రూపుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల సువేందు నివాసం ఉండే తూర్పు మేదినీపూర్లోని కాంటాయ్లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
దుండగులు గత వారం ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు, పరిసరాల గురించి సర్వే చేసినట్లు, సువేందు అధికారి నివాసాన్ని ఫోటోలు తీసినట్లు అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం..తక్షణ చర్యలు తీసుకోవాలని ఐబీ అధికారులు కోల్కతా పోలీసులను, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఆయన నివాసం చుట్టూ భద్రత పెంచాలని అధికారులకు ఆదేశాలు అందాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి Z+ సెక్యూరిటీ ఉన్న ఆయనకు మరింత సెక్యూరిటీ పెంచాలని ఆదేశాలు వచ్చాయి. పండుగ సీజన్లో ప్రమాదం ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర మరియు స్థానిక పోలీసు బలగాలతో పాటు CISF కూడా తమ నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఐబీ సూచించింది.
Also Read
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
Read Also: Arvind Kejriwal: బీజేపీ సీఎం అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఇలాంటి వ్యక్తి ఢిల్లీ సీఎం కావాలా..?
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వంలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగాయి. ఈ దాడుల్ని సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై ఆయన గళం విప్పారు. బంగ్లా మధ్యంతర ప్రభుత్వాన్ని మిలిటెంట్లతో పోల్చారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ చట్టబద్ధమైన ప్రధాని అని, ఆమెని తొలగించాల్సి వస్తే అది ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారానే జరగాలని ఆయన సూచించారు. యూనస్ ప్రభుత్వం చట్టవిరుద్ధమని చెప్పారు.
అయితే, ఈ ఉగ్రవాద ముప్పుపై అధికారి మాట్లాడుతూ.. తనకు ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లడం లేదని, ప్రజలే తనను కాపాడుతారని సువేందు అధికారి బుధవారం చెప్పారు. గతంలో సీపీఎం, టీఎంసీలు నాపై దాడి చేశాయని, ఇప్పుడు ఉగ్రవాదులు దాడి చేయాలని చూస్తున్నారని, అయితే ఇంతకుముందు తనను కాపాడిన ప్రజలే మళ్లీ కాపాడుతారని అన్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!