Vegetarian Hotel: ప్రపంచంలో మొట్టమొదటి సెవన్ స్టార్ వెజిటేరియన్ హోటల్ అయోధ్యలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vegetarian Hotel: భవ్య రామమందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతున్నాయి. రానున్న కాలంలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా, ప్రపంచంలోనే తీర్థయాత్ర గమ్యస్థానంగా మార్చేందుకు ఉత్తర్ ప్రదేశ్ కృషి చేస్తోంది. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 7000 మంది ప్రముఖులతో పాటు లక్షలాది మంది అయోధ్యకు రాబోతున్నారు. ఇప్పటికే యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లును చేసింది.
Read Also: Killer Soup: కిల్లర్ సూప్.. తెలంగాణలో జరిగిన రియల్ కథ అని తెలుసా.. ?
Also Read
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
ఇదిలా ఉంటే ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి శాఖాహార సెవన్-స్టార్ హోటల్ అయోధ్యలో రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికను సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అయోధ్యలో మొత్తం 25 కొత్త హోటల్ ప్రతిపాదనలు వచ్చాయని.. వీటిలో ఒకటి ప్రత్యేకంగా శాఖాహార హోటల్ ఉందని చెప్పారు. ఆలయ ప్రారంభం తర్వాత భక్తుల రద్దీతో పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఆలయాన్ని సందర్శించే భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు యోగి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అయోధ్యలో అత్యాధునిక హంగులతో ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దారు. అయోధ్య నుంచి వారణాసి, గోరఖ్పూర్, లక్నో, ప్రయాగ్రాజ్లను కలుపుతూ.. గ్రీన్ కారిడార్ ప్రణాళికను యూపీ సర్కార్ తీసుకురాబోతోంది.
రామ మందిర నిర్మాణంతో అయోధ్యకు కొత్త కళ వస్తేస్తోంది. హోటళ్లు, ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆలయం నుంచి 15 నిమిషాల దూరంలో విలాసవంతమైన ఎక్స్క్లేవ్ ‘ది సరయు’లో ఒక స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సరయు నది ఒడ్డున అనేక ఫైవ్ స్టార్ హోటల్స్ రాబోతున్నాయి. 110 చిన్న పెద్ద హోటళ్లు అయోధ్యలో ఏర్పాటు చేసేందుకు భూమిని కొనుగోలు చేస్తున్నారు. మొట్టమొదటి వెజ్ 7-స్టార్ హోటల్ని ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేయబోతోంది.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!