Vegetarian Hotel: ప్రపంచంలో మొట్టమొదటి సెవన్ స్టార్ వెజిటేరియన్ హోటల్ అయోధ్యలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vegetarian Hotel: భవ్య రామమందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతున్నాయి. రానున్న కాలంలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా, ప్రపంచంలోనే తీర్థయాత్ర గమ్యస్థానంగా మార్చేందుకు ఉత్తర్ ప్రదేశ్ కృషి చేస్తోంది. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 7000 మంది ప్రముఖులతో పాటు లక్షలాది మంది అయోధ్యకు రాబోతున్నారు. ఇప్పటికే యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లును చేసింది.
Read Also: Killer Soup: కిల్లర్ సూప్.. తెలంగాణలో జరిగిన రియల్ కథ అని తెలుసా.. ?
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ఇదిలా ఉంటే ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి శాఖాహార సెవన్-స్టార్ హోటల్ అయోధ్యలో రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికను సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అయోధ్యలో మొత్తం 25 కొత్త హోటల్ ప్రతిపాదనలు వచ్చాయని.. వీటిలో ఒకటి ప్రత్యేకంగా శాఖాహార హోటల్ ఉందని చెప్పారు. ఆలయ ప్రారంభం తర్వాత భక్తుల రద్దీతో పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఆలయాన్ని సందర్శించే భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు యోగి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అయోధ్యలో అత్యాధునిక హంగులతో ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దారు. అయోధ్య నుంచి వారణాసి, గోరఖ్పూర్, లక్నో, ప్రయాగ్రాజ్లను కలుపుతూ.. గ్రీన్ కారిడార్ ప్రణాళికను యూపీ సర్కార్ తీసుకురాబోతోంది.
రామ మందిర నిర్మాణంతో అయోధ్యకు కొత్త కళ వస్తేస్తోంది. హోటళ్లు, ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆలయం నుంచి 15 నిమిషాల దూరంలో విలాసవంతమైన ఎక్స్క్లేవ్ ‘ది సరయు’లో ఒక స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సరయు నది ఒడ్డున అనేక ఫైవ్ స్టార్ హోటల్స్ రాబోతున్నాయి. 110 చిన్న పెద్ద హోటళ్లు అయోధ్యలో ఏర్పాటు చేసేందుకు భూమిని కొనుగోలు చేస్తున్నారు. మొట్టమొదటి వెజ్ 7-స్టార్ హోటల్ని ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేయబోతోంది.
తాజావార్తలు
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Slum Dog Release : పూరీ జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
-
TG20 తొలి ఛాంపియన్గా ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
-
Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
-
Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!