Yogi Adityanath: అయోధ్యలో ఇకపై బుల్లెట్ల మోతలు, కర్ఫ్యూలు ఉండవు..ములాయం సింగ్పై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: అయోధ్యలో ఈ రోజు రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేత, మాజీ సీఎం దివంగత ములాయం సింగ్ యాదవ్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 1990లో అయోధ్యలో జరిగిన కాల్పుల్లో 17 మంది కరసేవకులు మరణించారు. ఈ సమయంలో ములాయం సింగ్ సీఎంగా ఉన్నారు.
యోగి మాట్లాడుతూ.. ‘‘ఇకపై అయోధ్య అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. అయోధ్య సందుల్లో బుల్లెట్ల మోతతో ప్రతిధ్వనించదు. కర్ఫ్యూలు ఉండవు. ఇప్పుడు దీపోత్సవం, రామోత్సవాలు జరుతాయి. రామకీర్తనలు ప్రతిధ్వనిస్తాయి. ఈ రోజు ఇక్కడ రామ్ లల్లా రామరాజ్యాన్ని సూచిస్తున్నారు’’. అని ఆయన అన్నారు. 1990 సంఘటనల గురించి ప్రస్తావిస్తూ..ఎస్పీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
Read Also: Mamata Banerjee: రామ మందిరానికి పోటీగా.. బెంగాల్లో మమత “సర్వమత” ర్యాలీ
అసలేం జరిగింది:
1990లో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ సారథ్యంలో రథయాత్ర నేపథ్యంలో రామ మందిర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున అయోధ్యకు చేరుకుంటుండటంతో సీఎంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ బలగాలను మోహరించారు. ‘‘అయోధ్యలో ఒక్క పక్షి కూడా ఎగరదు’’ అని ములాయం సింగ్ ప్రకటించాడు. అక్టోబర్ 30న రాష్ట్ర పోలీసులు బస్సుల్ని, రైళ్లను అడ్డుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు పాదయాత్ర చేశారు. బాబ్రీ మసీదు వద్ద ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో నవంబర్ 1న పోలీసులు కాల్పులు జరపడంతో 17 మంది కరసేవకులు మరణించారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. అతని కాలంలోనే డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదుని కూల్చివేత జరిగింది.
తాజావార్తలు
-
Sardar2 : కార్తీ ‘సర్దార్ -2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి యాక్షన్ డబుల్
-
Gold Price Prediction: బంగారం ధరలు రూ.30,000 వరకు తగ్గే అవకాశం.. డాయిష్ బ్యాంక్ సంచలన రిపోర్ట్?
-
CI Nagaraju-SIT: సాయికృష్ణ హత్య కేసు.. సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!
-
Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
-
Citroen Aircross Comfort Edition: సిట్రోయెన్ ఎయిర్క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల.. ప్రీమియం ఫీచర్లు, ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!