Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షాలు నడుపుకుంటున్నారు..
- ఔరంగజేబు వారసులు రిక్షాలు నడుపుకుంటున్నారు..
- యోగి ఆదిత్యనాథ్ కామెంట్స్ వివాదాస్పదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: మొఘల్ పాలకుడు ఔరంగజేబు, అతని వారసులను ఉద్దేశించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఔరంగజేబు వారసులు ఇప్పుడు కలకత్తా సమీపంలో నివసిస్తున్నారని, జీవించడానికి రిక్షాలు నడుపుకుంటూ బతుకుతున్నారని అన్నారు. ‘‘ఇది చరిత్ర యొక్క దైవిక న్యాయం’’గా అభివర్ణించారు. ఔరంగజేబు దైవత్వాన్ని ధిక్కరించి, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలపై విధ్వంసక చర్యలకు పాల్పడ్డాడని చెప్పారు.
Read Also: KTR Case: హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ.. ఏసీబీ కేసుపై లంచ్మోషన్ పిటిషన్
Also Read
- Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై యోగి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సనాతన విలువల్ని కాపాడాలని సమాజాన్ని కోరారు. ‘‘మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ‘వసుధైవ కుటుంబం’ (ప్రపంచం ఒకే కుటుంబం) అనే భావనను ఊహించారు. సంక్షోభ సమయంలో అన్ని వర్గాల, విశ్వాసాలకు ఆశ్రయం కల్పించిన ఏకైక మతం సనాతన ధర్మం. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ హిందువులకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.’’ అని అయోధ్యలోని అసర్ఫీ భవన్ పీఠ్లో జరిగిన సభలో అన్నారు.
కాశీ విశ్వనాథ్ ధామ్, అయోధ్య, సంభాల్, భోజ్పూర్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను ప్రస్తావిస్తూ, హిందూ దేవాలయాల చారిత్రక విధ్వంసాన్ని ఆదిత్యనాథ్ హైలైట్ చేశారు. శతాబ్ధాలుగా హిందూ ఆలయాలు పదేపదే దాడులకు గురువుతున్నాయని అన్నారు. 17వ శతాబ్ధంలో భారత్ని పాలించిన ఔరంగజేబు భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన మతోన్మాదిగా పేరొందారు. ముఖ్యంగా హిందువుల దేవాలయాలపై దాడులు, హిందువుల అణిచివేతకు ప్రతీకగా నిలిచారు.
తాజావార్తలు
-
గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
-
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్పై 3-1 తేడాతో.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!