Atul Subhash Case: మనవడి కోసం సుప్రీంకోర్టుకి అతుల్ సుభాష్ తల్లి..
- అతుల్ సుభాష్ నాలుగేళ్ల కొడుకు కోసం హెబియస్ కార్పస్..
- తమకు అప్పగించాలని కోరుతూ సుప్రీంకి వెళ్లిన సుభాష్ తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atul Subhash Case: భార్య తప్పుడు కేసులతో వేధింపులకు గురైన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ కేసులో ఇప్పటికే సుభాష్ భార్య నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. అతుల్ సుభాష్ తల్లి తన నాలుగేళ్ల మనవడి కస్టడీ కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తన మనవడిని తనకు అప్పగించాలని అంజు మోదీ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిఖితా కుటుంబం, పిల్లాడి ఆచూకీని వెల్లడించలేదని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. అతుల్ సుభాష్ తల్లి అంజు మోడీ తన పిటిషన్లో.. బిడ్డను కనుగొనే ప్రయత్నాలను సింఘానియా కుటుంబం అడ్డుకున్నట్లు చెప్పింది. సుభాష్ తండ్రి పవర్ కుమార్ కూడా బిడ్డను కస్టడీకి ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.
Also Read
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
Read Also: Cars24 CEO: కన్నడ మాట్లాడటం రాదా? ఢిల్లీకి రండి.. రచ్చకు దారి తీసిన పోస్ట్..
పిల్లాడిని ఫరీదాబాద్లోని బోర్డింగ్ స్కూల్లో చేర్పించారని, తన అంకుల్ సుశీల్ సింఘానియా కస్టడీలో ఉన్నాడని నిఖితా పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే, పిల్లాడి ఆచూకీ తనకు తెలియదని సుశీల్ కొట్టిపారేశారు. ఈ పిటిషన్ని బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడా ధర్మాసనం విచారించింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 07న జరగనుంది.
డిసెంబర్ 09న బెంగళూర్లో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు 24 పేజీల లేఖ, గంటకు పైగా ఉన్న వీడియో రికార్డ్ చేశారు. వీడియోలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. తన భార్య తనను తప్పుడు కేసుల్లో ఇరికించిందని, చివరకు న్యాయమూర్తి కూడా లంచం డిమాండ్ చేసిందని ఆరోపించాడు. ఈ కేసులో అతుల్ భార్య నిఖితా సింఘానియాతో పాటు తల్లి నిషా సింఘానియి, సోదరుడు అనురాగ్ సింఘానియాను డిసెంబర్ 16న అరెస్ట్ చేశారు. ముగ్గురిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
ట్రెండింగ్
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!