Asaduddin Owaisi: సీఎం వల్లే ఆర్జేడీలోకి మా ఎమ్మెల్యేలు.. ఈ సారి ఎక్కువ స్థానాల్లో పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ‘సీమాంచల్ అధికార యాత్ర’లో ప్రసంగిస్తూ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం నితీష్ కుమార్ వల్లే తమ ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారంటూ మండిపడ్డారు. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచ్ ప్రాంతంలో ఓవైసీ మూడు రోజులు పర్యటించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీమాంచల్ ప్రజలపై చూపిస్తున్న విపక్షకు వ్యతిరేకంగా మార్చి 18, మార్చి 19 తేదీల్లో ‘సీమాంచల్ అధికార యాత్ర’ జరుపుతున్నారు.
Read Also: Crime News: కన్నతల్లిని చంపి ఐదు ముక్కలు చేసిన కూతురు.. రెండు నెలలుగా ఇంట్లోనే
Also Read
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
గత ఎన్నికల్లో కనీసం 50 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉండేదని, నేను తప్పు చేశానని అన్నారు. ఈ సారి ఎక్కువ మందిని పోటీలో దించుతామని ఆయన అన్నారు. ఈరోజు పూర్ణియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశంలో బీజేపీని బలోపేతం చేసినందుకు నితీశ్ కుమార్ చరిత్రను గుర్తుంచుకుంటుందని, గుజరాత్ అల్లర్ల సమయంలో ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు.
పొత్తుల గురించి మాట్లాడుతూ.. నితీష్ ముందుగా మోదీతో నిఖా చేసుకుని, ఆ తరువాత తలాక్ చెప్పారని, ఇప్పుడు తేజస్వీ యాదవ్ తో నిఖా చేసుకున్నారంటూ సెటైర్ల సంధించారు. గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీహార్ లో గెలుపొందారు. ఇందుల్లో కొచ్చాధమన్కు చెందిన ముహమ్మద్ ఇజార్ అస్ఫీ, జోకిహాట్కు చెందిన షహన్బాజ్ ఆలం, బైసీకి చెందిన రుక్నుద్దీన్ అహ్మద్ మరియు బహదుర్గంజ్కు చెందిన అంజర్ నైమి ఆర్జేడీలో చేరారు. బీహార్ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మాత్రమే ఎంఐఎం ఎమ్మెల్యేగా మిగిలారు. బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీని అతిపెద్ద పార్టీ చేయడానికి సీఎం నితీష్ ఇలా చేశారని అసదుద్దీన్ అన్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 80 మంది, బీజేపీకి 77 మంది, నితీష్ కుమార్ జేడీయూకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!