Arvind Kejriwal: బీజేపీ ఓటర్లకు బంగారు గొలుసుల్ని ఇస్తోంది..
- బీజేపీ ఓటర్లు బంగారు గొలుసుల్ని పంచుతోంది..
- డబ్బులకు ఓట్లను అమ్ముకోవద్దు..
- డబ్బులు పంచితే ఆప్ అభ్యర్థులకు ఓటేయొద్దు..
- ఢిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్, బీజేపీ మధ్య విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ఫిబ్రవరి 5న ఢిల్లోలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే, ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు, ఆ పార్టీకి నిజాయితీ లేదని కేజ్రీవాల్ ఆరోపించారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెండు కాలనీ ఓట్ల కోసం ‘‘బంగారు గొలుసు’’లు పంచుతోందని, ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లు తమ ఓట్లను అమ్ముకోవద్దని ఓటర్లను కోరారు. బీజేపీ నేతలు నగదు, ఇతర వస్తువుల్ని పంపిణీ చేయడం ద్వారా ఢిల్లీ ఓట్లను కొనుగోలు చేయాలని ప్లాన్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ‘‘వారు బంగారు గొలుసులు పంపిణీ చేయడం ప్రారంభించాని మాకు తెలిసింది. వారు రెండు కాలనీల్లో ఓట్లను కొంటున్నారు. ప్రజల డబ్బు, చీరలు, బ్లాంకెట్స్, ఇతర వస్తువులు ఎక్కడికి వెళ్లాయో బీజేపీ నేతలు వివరించాలి’’ అని కేజ్రీవాల్ అన్నారు.
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
Read Also: Udyogini Scheme: మహిళలకు రూ. 3 లక్షల వడ్డీలేని రుణం ఇస్తున్న కేంద్రం.. 50 శాతం సబ్సిడీ కూడా!
ఓట్లకు డబ్బులు పంచుతున్నట్లు తెలిస్తే ఏ ఆప్ అభ్యర్థికి ఓటు వేయవద్దని కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు. మేము ఎన్నికల్లో గెలవడానికి, ఓడిపోవడానికి ఇక్కడికి రాలేదు, దేశాన్ని మార్చడానికి మేము ఉన్నామని అన్నారు. ప్రజలు బీజేపీ పంపిణీ చేస్తున్న ప్రతీదానిని తీసుకోవాలని, కానీ ఓట్లు అమ్ముకోవద్దు అని కోరారు. డబ్బులు పంపిణీ చేసే ఎవరికీ ఓటేయద్దని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కేజ్రీవాల్పై బీజేపీ విరుచుకుపడుతోంది. ఏ రాజకీయ కూటమిలో చేరబోనని కేజ్రీవాల్ ఇచ్చిన హామీని ఉల్లంఘించారుని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఆప్ నాయకుల అవినీతి ముఖాన్ని ఓటర్లు గుర్తించారని అన్నారు. కేజ్రీవాల్కి ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు వీడ్కోలు పలుకుతారని చెప్పారు. కాంగ్రెస్తో ఆప్ చేతులు కలిపిందని, కేజ్రీవాల్ ఆయన హామీలను మరిచిపోయిందని ఆయన అన్నారు. బీజేపీ ఢిల్లీలో మురికివాడల వాసులకు కాంక్రీట్ ఇల్లు ఇస్తామని, మురికివాడలకు మంచి రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 5 అరవింద్ కేజ్రీవాల్కి వీడ్కోలు పలికే రోజని అన్నారు.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..