Arvind Kejriwal: బీజేపీ ఓటర్లకు బంగారు గొలుసుల్ని ఇస్తోంది..
- బీజేపీ ఓటర్లు బంగారు గొలుసుల్ని పంచుతోంది..
- డబ్బులకు ఓట్లను అమ్ముకోవద్దు..
- డబ్బులు పంచితే ఆప్ అభ్యర్థులకు ఓటేయొద్దు..
- ఢిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి..
Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్, బీజేపీ మధ్య విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ఫిబ్రవరి 5న ఢిల్లోలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే, ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు, ఆ పార్టీకి నిజాయితీ లేదని కేజ్రీవాల్ ఆరోపించారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెండు కాలనీ ఓట్ల కోసం ‘‘బంగారు గొలుసు’’లు పంచుతోందని, ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లు తమ ఓట్లను అమ్ముకోవద్దని ఓటర్లను కోరారు. బీజేపీ నేతలు నగదు, ఇతర వస్తువుల్ని పంపిణీ చేయడం ద్వారా ఢిల్లీ ఓట్లను కొనుగోలు చేయాలని ప్లాన్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ‘‘వారు బంగారు గొలుసులు పంపిణీ చేయడం ప్రారంభించాని మాకు తెలిసింది. వారు రెండు కాలనీల్లో ఓట్లను కొంటున్నారు. ప్రజల డబ్బు, చీరలు, బ్లాంకెట్స్, ఇతర వస్తువులు ఎక్కడికి వెళ్లాయో బీజేపీ నేతలు వివరించాలి’’ అని కేజ్రీవాల్ అన్నారు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
Read Also: Udyogini Scheme: మహిళలకు రూ. 3 లక్షల వడ్డీలేని రుణం ఇస్తున్న కేంద్రం.. 50 శాతం సబ్సిడీ కూడా!
ఓట్లకు డబ్బులు పంచుతున్నట్లు తెలిస్తే ఏ ఆప్ అభ్యర్థికి ఓటు వేయవద్దని కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు. మేము ఎన్నికల్లో గెలవడానికి, ఓడిపోవడానికి ఇక్కడికి రాలేదు, దేశాన్ని మార్చడానికి మేము ఉన్నామని అన్నారు. ప్రజలు బీజేపీ పంపిణీ చేస్తున్న ప్రతీదానిని తీసుకోవాలని, కానీ ఓట్లు అమ్ముకోవద్దు అని కోరారు. డబ్బులు పంపిణీ చేసే ఎవరికీ ఓటేయద్దని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కేజ్రీవాల్పై బీజేపీ విరుచుకుపడుతోంది. ఏ రాజకీయ కూటమిలో చేరబోనని కేజ్రీవాల్ ఇచ్చిన హామీని ఉల్లంఘించారుని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఆప్ నాయకుల అవినీతి ముఖాన్ని ఓటర్లు గుర్తించారని అన్నారు. కేజ్రీవాల్కి ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు వీడ్కోలు పలుకుతారని చెప్పారు. కాంగ్రెస్తో ఆప్ చేతులు కలిపిందని, కేజ్రీవాల్ ఆయన హామీలను మరిచిపోయిందని ఆయన అన్నారు. బీజేపీ ఢిల్లీలో మురికివాడల వాసులకు కాంక్రీట్ ఇల్లు ఇస్తామని, మురికివాడలకు మంచి రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 5 అరవింద్ కేజ్రీవాల్కి వీడ్కోలు పలికే రోజని అన్నారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!