Sunita Kejriwal: నా భర్తను కేంద్రం టెర్రరిస్టులా చూస్తోంది.. బెయిల్ వాయిదాపై కేజ్రీవాల్ భార్య..
- అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వాయిదాపై భార్య ఫైర్..
- కేంద్రం కేజ్రీవాల్ని టెర్రరిస్టులా చూస్తోంది..
- దేశంలో నియంతృత్వం పెరిగిపోయింది..
- కేంద్రం టార్గెట్గా సునీతా కేజ్రీవాల్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా, బెయిల్పై స్టే విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ని కొట్టేయాలంటూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఈడీ పిటిషన్ విచారించేందుకు కోర్టు అంగీకరించింది.
దీనిపై సునీతా కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఆర్డర్ అప్లోడ్ చేయడానికి ముందే బెయిల్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఎలా ఆశ్రయించిందని ప్రశ్నించారు. తన భర్తను ప్రభుత్వం, కేంద్ర సంస్థలు వాంటెడ్ టెర్రరిస్టులా చూస్తోందని ఆమె ఆరోపించారు. దేశంలో నియంతృత్వం పెరిగిపోయిందని, నియంతృత్వం అని పరిమితులను దాటిందని ఆమె అన్నారు.
Also Read
Read Also: Instagram : ‘క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్’ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చిన ఇన్స్టాగ్రామ్..
మరోవైపు ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘ మోడీ ప్రభుత్వం గుండాయిజం చూడండి. ట్రయల్ కోర్టు ఆర్డర్ ఇంకా రాలేదు. ఆర్డర్ కాపీ కూడా రాలేదు. మోడీ యొక్క ఈడీ హైకోర్టుకు చేరుకుంది. ఈ దేశంలో ఏం జరుగుతోంది. మోడీజీ మీరు న్యాయ వ్యవస్థను ఎందుకు అపహాస్యం చేస్తున్నారు.. దేశం మొత్తం మిమ్మల్ని గమనిస్తోంది’’ అని ఆయన అన్నారు.
ఈడీ తరుపును అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తన వాదనలు ఢిల్లీ హైకోర్టులో వినిపించగా, కేజ్రీవాల్ తురుపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి వాదనలను వినిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!