Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏకి బెయిల్..
- స్వాతి మలివాల్ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏకి బెయిల్..
- లోక్సభ ఎన్నికల ముందు సంచలనంగా మారిన ఘటన..
- దాదాపు 100 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal Assault Case: లోక్సభ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ నివాసంలోనే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మే 13న దాడి జరిగితే మే 18న బిభవ్ కుమార్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, దాదాపు 100 రోజలు తర్వాత బెయిల్ లభించింది. అతడికి సుప్రీంకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. బిభవ్ కుమార్ని మళ్లీ పర్సనల్ పీఏగా చేర్చుకోవద్దని, ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారి నియామకం చేయరాదని ఆదేశించింది.
Read Also: CM Revanth Reddy: మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు.. ఎకరాకు రూ.10 వేలు పరిహారం
Also Read
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
- PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్పై దాడి చేశాడు. తనను బిభవ్ ఏడు సార్లు చెంపపై కొట్టడమే కాకుండా, సున్నిత భాగాలపై కడుపులో తన్నాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో పోలీసులు, ఫోరెన్సిక్ టీం కేజ్రీవాల్ నివాసంలో సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసులో జాతీయ మహిళా కమిషన్ బిభవ్ కుమార్ని తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ఆ సమయంలో ఈ కేసుపై ఆప్ స్పందిస్తూ.. ఆమె బీజేపీకి బంటుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా మే 13న కేజ్రీవాల్ నివాసానికి ఆమె వచ్చారని ఆప్ మంత్రి ఆతిషీ ఆరోపించారు. స్వాతి మలివాల్ని వెయిటింగ్ రూంలో వేచి ఉండాల్సిందిగా చెప్పినా కూడా ఆమె ఆగకుండా డ్రాయింగ్ రూంలోకి ప్రవేశించిందని, ఆమెను అడ్డుకునేందుకు బిభవ్ కుమార్ వచ్చారని అతిషీ పేర్కొన్నారు. ఇదంతా బీజేపీ ప్లాన్ అని ఆమె ఆరోపించారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ ఆప్ని టార్గెట్ చేస్తోంది. సీఎం కేజ్రీవాల్ నిందితుడు బిభవ్ కుమార్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’: పోసాని కృష్ణమురళి
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!