BJP: ‘‘ఇంకా కులాల గురించి మాట్లాడుతున్నావా..?’’ రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- కుంభమేళా చూసి కూడా కులాల గురించి మాట్లాడుతున్నావా..?
- రాహుల్ గాంధీ ‘‘కుల గణన’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
BJP: దేశంలోని అసమానత, వివక్ష నిజాన్ని బయటకు తీసుకురావడానికి కుల గణన సహాయపడుతుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ధ్వజమెత్తుతోంది. శుక్రవారం, కాంగ్రెస్ ఎంపీపై విమర్శలు చేసింది. ‘‘కుంభమేళాలో ఎవరూ కులం గురించి అడగలేదు. ఎవరూ ఎవరినీ అవమానించలేదు. ఎవరికీ డెంగ్యూ లేదా మలేరియా రాలేదు. ఎవరూ ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోలేదు. సనాతన ధర్మం యొక్క బలాన్ని అర్థం చేసుకున్నప్పటికీ, మీరు ఇప్పటికీ కులం గురించి మాట్లాడాలని అనుకుంటున్నారా..?’’ అని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ అన్నారు.
‘‘మీరు (రాహుల్ గాంధీ) ఓడిపోయారు. మీరు ఎంత ఎక్కువగా కులగణన అడిగితే అంత ఎక్కువగా ఓడిపోతారు’’ అని గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. గతేడాది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
Read Also: Deputy CM Bhatti: గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రయత్నించింది..
గురువారం, మాజీ గ్రాంట్ కమిషన్ చైర్మన్, విద్యావేత్త సుఖ్దేవ్ థోరాట్లో జరిగిన ఒక డిబేట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కుల గణన అసమానలను బయటకు తీసుకురావడానికి ఒక ముందడుగు అని, కుల గణనను వ్యతిరేకించే వారు నిజాలు బయటపడొద్దని చూస్తు్న్నారని ఆరోపించారు. 1927లో జరిగిన మహద్ సత్యాగ్రహం ద్వారా అంబేద్కర్ కుల వివక్షను నేరుగా సవాల్ చేశారని రాహుల్ గాంధీ అన్నారు. ఇది కేవలం నీటి కోసం పోరాటం కాదని, సమానత్వ, గౌరవం కోసం అని, 98 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పోరాట నేటికి కొనసాగుతోందని కాంగ్రెస్ నేత అన్నారు.
దేశంలో మెరిట్ ఆధారిత వ్యవస్థను రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది దళితులు, వెనకబడిన తరగతులు, గిరిజనుల పట్ల లోపభూయిష్టంగా ఉందని, అన్యాయంగా ఉందని చెప్పారు. మన విద్యా వ్యవస్థ, బ్యూరోక్రసీ ప్రవేశ వ్యవస్థలు దళితులు, ఓబీసీలు, గిరిజనులకు న్యాయం చేస్తుందని ఎవరైనా అనుకుంటే పూర్తిగా తప్పని రాహుల్ గాంధీ అన్నారు. మెరిట్ వ్యవస్థ ‘‘ఉన్నత కులాలు కథనం’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!