Anurag Thakur: మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి.. మతకలహాలు, బీజేపీ నేత హత్యపై కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur: రామ నవమి వేడుకల్లో హౌరా, బెంగాల్ లోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ మత ఘర్షణలపై బీజేపీ, త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే దుర్గాపూర్కు చెందిన వ్యాపారవేత్త, బిజెపి నాయకుడు రాజు ఝా, కొంతమంది సహచరులతో కలిసి కోల్కతాకు వెళుతుండగా, శక్తిగఢ్ ప్రాంతంలోని మిఠాయి దుకాణం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
Read Also: Himanta Biswa Sarma: ఖలిస్తాన్ ఉగ్రవాది నుంచి అస్సాం సీఎంకు బెదిరింపులు..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..టీఎంసీ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మత ఉద్రిక్తతలను పెంచుతున్నారని, ఆమె హిందూ వ్యతిరేకి అని, ఓ వర్గానికి మాత్రమే పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్ లో రామభక్తులను కొట్టారని, శోభాయాత్రను బలవంతంగా నిలిపేయాల్సి వచ్చిందని, రామభక్తులపై లాఠీలతో దాడులు చేశారు, రాళ్లురువ్వారు, బాంబులు విసిరారని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. బెంగాల్ లో అల్లర్లు, కాల్పులు మమతా బెనర్జీ పిలుపు మేరకే జరిగాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని అన్నారు. హిందువులపై దాడి జరుగుతుంటే మమత మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ నిద్రపోతూ.. ఓ వర్గానికి మాత్రమే భద్రత కల్పిస్తోందని, హిందూ సమాజంలోని ప్రజలపై హింసను ప్రేరేపిస్తోందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
మతఘర్షణలు జరిగిన శిబ్ పూర్ ప్రాంతంలో సందర్శించకుండా బీజేపీ రాష్ట్ర చీఫ్ సుకాంత మంజుదార్ను అధికారులు అడ్డుకున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ కేవలం ఒక మతానికి మాత్రమే ముఖ్యమంత్రి అని ఆయన విమర్శించారు. పూర్భా బర్థమాన్ జిల్లాలో బీజేపీ నాయకుడిని హత్య చేయడంపై మమతా బెనర్జీపై మండిపడ్డారు. రామ నవమి అల్లర్లపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రామ నవమి రోజు హౌరాలోని పలు ప్రాంతాల్లో శోభాయాత్ర సమయంలో ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో పలు వాహనాలు, ఇళ్లు కాల్చివేయబడ్డాయి. హౌరా హింసపై కేంద్ర హోంమంత్రి బెంగాల్ గవర్నర్ ను నివేదిక కోరారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!