Anurag Thakur: మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి.. మతకలహాలు, బీజేపీ నేత హత్యపై కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anurag Thakur: రామ నవమి వేడుకల్లో హౌరా, బెంగాల్ లోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ మత ఘర్షణలపై బీజేపీ, త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే దుర్గాపూర్కు చెందిన వ్యాపారవేత్త, బిజెపి నాయకుడు రాజు ఝా, కొంతమంది సహచరులతో కలిసి కోల్కతాకు వెళుతుండగా, శక్తిగఢ్ ప్రాంతంలోని మిఠాయి దుకాణం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
Read Also: Himanta Biswa Sarma: ఖలిస్తాన్ ఉగ్రవాది నుంచి అస్సాం సీఎంకు బెదిరింపులు..
Also Read
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
- Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..టీఎంసీ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మత ఉద్రిక్తతలను పెంచుతున్నారని, ఆమె హిందూ వ్యతిరేకి అని, ఓ వర్గానికి మాత్రమే పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్ లో రామభక్తులను కొట్టారని, శోభాయాత్రను బలవంతంగా నిలిపేయాల్సి వచ్చిందని, రామభక్తులపై లాఠీలతో దాడులు చేశారు, రాళ్లురువ్వారు, బాంబులు విసిరారని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. బెంగాల్ లో అల్లర్లు, కాల్పులు మమతా బెనర్జీ పిలుపు మేరకే జరిగాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని అన్నారు. హిందువులపై దాడి జరుగుతుంటే మమత మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ నిద్రపోతూ.. ఓ వర్గానికి మాత్రమే భద్రత కల్పిస్తోందని, హిందూ సమాజంలోని ప్రజలపై హింసను ప్రేరేపిస్తోందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
మతఘర్షణలు జరిగిన శిబ్ పూర్ ప్రాంతంలో సందర్శించకుండా బీజేపీ రాష్ట్ర చీఫ్ సుకాంత మంజుదార్ను అధికారులు అడ్డుకున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ కేవలం ఒక మతానికి మాత్రమే ముఖ్యమంత్రి అని ఆయన విమర్శించారు. పూర్భా బర్థమాన్ జిల్లాలో బీజేపీ నాయకుడిని హత్య చేయడంపై మమతా బెనర్జీపై మండిపడ్డారు. రామ నవమి అల్లర్లపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రామ నవమి రోజు హౌరాలోని పలు ప్రాంతాల్లో శోభాయాత్ర సమయంలో ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో పలు వాహనాలు, ఇళ్లు కాల్చివేయబడ్డాయి. హౌరా హింసపై కేంద్ర హోంమంత్రి బెంగాల్ గవర్నర్ ను నివేదిక కోరారు.
తాజావార్తలు
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!