NEET Case: నీట్ కేసులో మరో మెడికల్ విద్యార్థి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Case: నీట్ కేసులో మరో మెడికల్ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. నీట్ ఎగ్జామ్ రాకెట్ నడిపిస్తున్న మెడికల్ కాలేజీ విద్యార్థిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మెడికల్ కాలేజీ విద్యార్థి సంజూ యాదవ్ను అరెస్టు చేసిన ఒక నెల తర్వాత ఇప్పుడు ఈ రాకెట్ నడుపుతున్న మరో విద్యార్థిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో రిగ్గింగ్కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అదే కాలేజీకి చెందిన మరో విద్యార్థి సంజూ యాదవ్ను నెలక్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అసలు అభ్యర్థి స్థానంలో సంజూయాదవ్ నీట్ అభ్యర్థిగా హాజరయ్యాడు. దీంతో పరీక్షకు హాజరై దొరికి పోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతడిని అరెస్టు చేసిన ఒక నెల తర్వాత మరో అరెస్టు జరిగిందని పోలీసులు తెలిపారు. నిజమైన విద్యార్థులకు బదులుగా నీట్ పరీక్షలకు హాజరైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) విద్యార్థులు నిర్వహిస్తున్న రాకెట్ను ఢిల్లీ పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఎయిమ్స్లో బీఎస్సీ (రేడియాలజీ, ద్వితీయ సంవత్సరం) విద్యార్థి నరేష్ బిష్రోయ్ అనే ముఠా నాయకుడు సహా నలుగురు విద్యార్థులను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు.
Read also: NCP Crisis: పవార్ వర్సెస్ పవార్.. పోటాపోటీగా విప్ జారీ చేసిన రెండు వర్గాలు..
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
మే నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ సమయంలో అసలు అభ్యర్థికి బదులు సంజూ యాదవ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. అతడి బయోమెట్రిక్ సరిపోలకపోవడంతో అనుమానంతో యాదవ్ను అరెస్టు చేశారు. అనంతరం తనిఖీ చేయగా అతని ఐడి కార్డు, ఆధార్ కార్డుతో సహా అధికారిక పత్రాలు అన్నీ కూడా నకిలీవేనని తేలిందని పోలీసు అధికారి తెలిపారు. కేసు విచారణ సందర్భంగా కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్ణోయ్.. భారీ మొత్తంలో డబ్బు ఆశచూపి.. ఒకరికి బదులు మెడికల్ ప్రవేశ పరీక్షలో తాను పరీక్ష రాసేలా ఒప్పించాడని.. యాదవ్ వెల్లడించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. విచారణ అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిష్ణోయ్ ఒక్కో అభ్యర్థికి సుమారు రూ. 6 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. నీట్ రాకెట్కు పాల్పడుతున్న అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని.. మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!