NEET Case: నీట్ కేసులో మరో మెడికల్ విద్యార్థి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Case: నీట్ కేసులో మరో మెడికల్ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. నీట్ ఎగ్జామ్ రాకెట్ నడిపిస్తున్న మెడికల్ కాలేజీ విద్యార్థిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మెడికల్ కాలేజీ విద్యార్థి సంజూ యాదవ్ను అరెస్టు చేసిన ఒక నెల తర్వాత ఇప్పుడు ఈ రాకెట్ నడుపుతున్న మరో విద్యార్థిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో రిగ్గింగ్కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అదే కాలేజీకి చెందిన మరో విద్యార్థి సంజూ యాదవ్ను నెలక్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అసలు అభ్యర్థి స్థానంలో సంజూయాదవ్ నీట్ అభ్యర్థిగా హాజరయ్యాడు. దీంతో పరీక్షకు హాజరై దొరికి పోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతడిని అరెస్టు చేసిన ఒక నెల తర్వాత మరో అరెస్టు జరిగిందని పోలీసులు తెలిపారు. నిజమైన విద్యార్థులకు బదులుగా నీట్ పరీక్షలకు హాజరైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) విద్యార్థులు నిర్వహిస్తున్న రాకెట్ను ఢిల్లీ పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఎయిమ్స్లో బీఎస్సీ (రేడియాలజీ, ద్వితీయ సంవత్సరం) విద్యార్థి నరేష్ బిష్రోయ్ అనే ముఠా నాయకుడు సహా నలుగురు విద్యార్థులను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు.
Read also: NCP Crisis: పవార్ వర్సెస్ పవార్.. పోటాపోటీగా విప్ జారీ చేసిన రెండు వర్గాలు..
Also Read
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
మే నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ సమయంలో అసలు అభ్యర్థికి బదులు సంజూ యాదవ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. అతడి బయోమెట్రిక్ సరిపోలకపోవడంతో అనుమానంతో యాదవ్ను అరెస్టు చేశారు. అనంతరం తనిఖీ చేయగా అతని ఐడి కార్డు, ఆధార్ కార్డుతో సహా అధికారిక పత్రాలు అన్నీ కూడా నకిలీవేనని తేలిందని పోలీసు అధికారి తెలిపారు. కేసు విచారణ సందర్భంగా కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్ణోయ్.. భారీ మొత్తంలో డబ్బు ఆశచూపి.. ఒకరికి బదులు మెడికల్ ప్రవేశ పరీక్షలో తాను పరీక్ష రాసేలా ఒప్పించాడని.. యాదవ్ వెల్లడించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. విచారణ అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిష్ణోయ్ ఒక్కో అభ్యర్థికి సుమారు రూ. 6 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. నీట్ రాకెట్కు పాల్పడుతున్న అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని.. మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!