Diwali: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ‘‘దీపావళి’’పై ఉద్రిక్తత..
- అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ‘‘దీపావళి’’పై వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali: ‘‘హోలీ’’ వివాదం మరిచిపోక ముందే, ఉత్తర్ ప్రదేశ్లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU)లో మరో వివాదం చెలరేగింది. అక్టోబర్ 18న హిందూ విద్యార్థులు క్యాంపస్లో ‘‘దీపావళి’’ జరుపుకోవడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిరాకరించడం వివాదాస్పదమైంది. అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నందున అక్టోబర్ 18 తర్వాత, ఒకటి రెండు రోజులకు వేడుకలు జరుపుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులను కోరింది. దీపావళి జరుపుకోవడంపై ఎలాంటి ఇబ్బంది లేదని వర్సిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో హోలీకి ముందు యూనివర్సిటీలో గందరగోళం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ వారం ప్రారంభంలో మాస్ కమ్యూనికేషన్ విద్యార్థి అఖిల్ కౌషల్ అక్టోబర్ 18న NRSC క్లబ్లో దీపావళి వేడుకలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ వైస్ ఛాన్సలర్కు లేఖ రాశారు. అనుమతి ఇవ్వకుంటే విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ వద్ద దీపావళి జరుపుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. హోలీ సమయంలో తమకు అనుమతి ఇవ్వకుండా వర్సిటీ తప్పు చేసిందని, వారు మళ్లీ తెలివైన వారు అయితే మళ్లీ ఇదే తప్పును రిపీట్ చేయరని ఆయన అన్నారు. ఒక వేళ అనుమతి రాకుంటా యూనివర్సిటీ హిందూ విద్యార్థులు ఏఎంయూ ‘‘బాబ్-ఎ-సయ్యద్’’ గేట్ వద్ద వైభవంగా దీపావళి జరుపుకుంటారని అన్నారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
Read Also: Earbuds: లావా దీపావళి ఆఫర్.. కేవలం రూ. 21 కే ఇయర్బడ్స్..
దీనిపై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వసీం అలీ మాట్లాడుతూ, దీపావళి నిర్వహించుకోవడంతో ఎలాంటి పరిమితి విధించలేదు అని చెప్పారు. కాబట్టి లిఖితపూర్వం అనుమతి ఇవ్వడంలో అర్థం లేదు అని అన్నారు .అక్టోబర్ 18న విద్యార్థులు దీపావళి జరుపుకోవాలన్నది మాత్రమే మా ఆందోళన అని, అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం కారణంగా, అక్టోబర్ 18న వేదికను శుభ్రం చేయడం సాధ్యం కాదు అని అలీ చెప్పారు.
అంతకు ముందు, హోలీ సమయంలో కూడా ఇలాగే వివాదం ఏర్పడింది. మార్చి 09న క్యాంపస్ లోపల హోలీ మిలన్ నిర్వహించేందుకు యూనివర్సిటీ పరిపాలన అనుమతి ఇవ్వలేదు. దీంతో హిందువులపై వివక్ష చూపిస్తున్నారని అనేక మంది విద్యార్థులు, అఖిల భారతీయ కర్ణి సేన సభ్యులు వర్సిటీకి వ్యతిరేకంగా భారీ నిరసన నిర్వహించారు. ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీంతో, వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తలొగ్గి, యూనివర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా, భారీ భద్రత మధ్య హోలీ జరిగింది.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!