Amit Shah: కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందే.. ధన్ఖర్ గురించి అమిత్ షా ఏమన్నారంటే..!
- కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందే
- ధన్ఖర్ గురించి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కళంకిత నేతలు జైలు నుంచి పరిపాలించడమేంటి? అని ప్రశ్నించారు. అందుకోసమే కళంకిత నేతలను తొలగించే బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ బిల్లు ద్వారా ముఖ్యమంత్రి అయినా.. ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే రాజీనామా చేయాల్సిందేనని.. 30 రోజుల్లో బెయిల్ రాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kerala: లైంగిక వేధింపుల ఎఫెక్ట్.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్
Also Read
- Mayawati's Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
విపక్ష నేతలు జైలుకెళ్లి సులభంగా ప్రభుత్వాలను నడపగలమని అనుకుంటున్నారని.. జైలునే సీఎం, పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారన్నారు. అప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, ఉన్నతాధికారులు జైలు నుంచే కీలక ఆదేశాలు తీసుకోవల్సి ఉంటుందన్నారు. ఇది మంచి పద్దతేనా? అని అడిగారు. ఈ విధానాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. జైలు నుంచి ప్రభుత్వాలు నడిపే పరిస్థితి మన దేశంలో ఉండకూడదన్నారు.
జగదీప్ ధన్ఖర్ అనారోగ్య కారణాల చేత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారని.. ఈ అంశాన్ని ఎక్కువగా సాగదీయొద్దని హితవు పలికారు. కొత్తగా ఏదైనా కనుగొనడానికి ప్రయత్నించొద్దని తెలిపారు. కేవలం అనారోగ్యంతో రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Marko Producer : మార్కో నిర్మాత సెకండ్ మూవీ.. ఇంకా అరాచకం
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అని ఆరోపించారు. నక్సల్ వ్యతిరేక నిఘా ఉద్యమం సల్వా జుడుంను రద్దు చేస్తూ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారని.. 2011 సుప్రీంకోర్టు తీర్పును అమిత్ షా గుర్తుచేశారు. ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ తీర్పు వచ్చిందని వివరించారు. ఈ నిర్ణయం వామపక్ష తీవ్రవాదానికి కొత్త ఊతం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. నక్సలిజానికి మద్దతిచ్చే సుదర్శన్రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని ఆరోపించారు.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ నుంచి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుదర్శన్రెడ్డి పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
ట్రెండింగ్
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!