Amit Shah: కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందే.. ధన్ఖర్ గురించి అమిత్ షా ఏమన్నారంటే..!
- కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందే
- ధన్ఖర్ గురించి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కళంకిత నేతలు జైలు నుంచి పరిపాలించడమేంటి? అని ప్రశ్నించారు. అందుకోసమే కళంకిత నేతలను తొలగించే బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ బిల్లు ద్వారా ముఖ్యమంత్రి అయినా.. ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే రాజీనామా చేయాల్సిందేనని.. 30 రోజుల్లో బెయిల్ రాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kerala: లైంగిక వేధింపుల ఎఫెక్ట్.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్
Also Read
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
విపక్ష నేతలు జైలుకెళ్లి సులభంగా ప్రభుత్వాలను నడపగలమని అనుకుంటున్నారని.. జైలునే సీఎం, పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారన్నారు. అప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, ఉన్నతాధికారులు జైలు నుంచే కీలక ఆదేశాలు తీసుకోవల్సి ఉంటుందన్నారు. ఇది మంచి పద్దతేనా? అని అడిగారు. ఈ విధానాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. జైలు నుంచి ప్రభుత్వాలు నడిపే పరిస్థితి మన దేశంలో ఉండకూడదన్నారు.
జగదీప్ ధన్ఖర్ అనారోగ్య కారణాల చేత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారని.. ఈ అంశాన్ని ఎక్కువగా సాగదీయొద్దని హితవు పలికారు. కొత్తగా ఏదైనా కనుగొనడానికి ప్రయత్నించొద్దని తెలిపారు. కేవలం అనారోగ్యంతో రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Marko Producer : మార్కో నిర్మాత సెకండ్ మూవీ.. ఇంకా అరాచకం
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అని ఆరోపించారు. నక్సల్ వ్యతిరేక నిఘా ఉద్యమం సల్వా జుడుంను రద్దు చేస్తూ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారని.. 2011 సుప్రీంకోర్టు తీర్పును అమిత్ షా గుర్తుచేశారు. ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ తీర్పు వచ్చిందని వివరించారు. ఈ నిర్ణయం వామపక్ష తీవ్రవాదానికి కొత్త ఊతం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. నక్సలిజానికి మద్దతిచ్చే సుదర్శన్రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని ఆరోపించారు.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ నుంచి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుదర్శన్రెడ్డి పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!