Amit Shah: కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందే.. ధన్ఖర్ గురించి అమిత్ షా ఏమన్నారంటే..!
- కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందే
- ధన్ఖర్ గురించి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కళంకిత నేతలు జైలు నుంచి పరిపాలించడమేంటి? అని ప్రశ్నించారు. అందుకోసమే కళంకిత నేతలను తొలగించే బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ బిల్లు ద్వారా ముఖ్యమంత్రి అయినా.. ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే రాజీనామా చేయాల్సిందేనని.. 30 రోజుల్లో బెయిల్ రాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kerala: లైంగిక వేధింపుల ఎఫెక్ట్.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్
Also Read
- Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
విపక్ష నేతలు జైలుకెళ్లి సులభంగా ప్రభుత్వాలను నడపగలమని అనుకుంటున్నారని.. జైలునే సీఎం, పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారన్నారు. అప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, ఉన్నతాధికారులు జైలు నుంచే కీలక ఆదేశాలు తీసుకోవల్సి ఉంటుందన్నారు. ఇది మంచి పద్దతేనా? అని అడిగారు. ఈ విధానాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. జైలు నుంచి ప్రభుత్వాలు నడిపే పరిస్థితి మన దేశంలో ఉండకూడదన్నారు.
జగదీప్ ధన్ఖర్ అనారోగ్య కారణాల చేత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారని.. ఈ అంశాన్ని ఎక్కువగా సాగదీయొద్దని హితవు పలికారు. కొత్తగా ఏదైనా కనుగొనడానికి ప్రయత్నించొద్దని తెలిపారు. కేవలం అనారోగ్యంతో రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Marko Producer : మార్కో నిర్మాత సెకండ్ మూవీ.. ఇంకా అరాచకం
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అని ఆరోపించారు. నక్సల్ వ్యతిరేక నిఘా ఉద్యమం సల్వా జుడుంను రద్దు చేస్తూ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారని.. 2011 సుప్రీంకోర్టు తీర్పును అమిత్ షా గుర్తుచేశారు. ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ తీర్పు వచ్చిందని వివరించారు. ఈ నిర్ణయం వామపక్ష తీవ్రవాదానికి కొత్త ఊతం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. నక్సలిజానికి మద్దతిచ్చే సుదర్శన్రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని ఆరోపించారు.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ నుంచి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుదర్శన్రెడ్డి పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!