Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశానికి ప్రధాని అయ్యారు.. మోడీ 100 రోజుల పాలనపై అమిత్ షా వ్యాఖ్యలు..
- ఎన్డీయే 100 రోజుల పనితీరుపై అమిత్ షా కీలక ప్రకటన..
- మోడీ దేశానికి గర్వకారణం అంటూ ప్రశంసలు..
- ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశాని ప్రధాని అయి, దేశానికి గర్వకారణగా నిలిచారని ప్రధాని నరేంద్రమోడీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఈ రోజు మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలతో పాటు తాము కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్నామని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అమిత్ షా వివరించారు. మోడీ జీ నాయకత్వంలో 10 సంవత్సరాలలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దులు రక్షణ మరింత బలోపేతమైందని చెప్పారు.
విద్యను ఆధునికంగా, అందరిని కలుపుకునిపోయేలా తీర్చిద్దారని, అంతరిక్ష రంగంలో భారత భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని షా అన్నారు. పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు, కరెంటు, నీరు, ఆరోగ్య సేవలు, ధాన్యం పంపిణీ చేశారని చెప్పారు. 100 రోజుల్లో రూ.15 లక్షల కోట్లతో ప్రాజెక్టులు అమలు చేశామని, 25 వేల కోట్ల గ్రామాలను అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. బనారస్, బిహ్తా సహా 5 కొత్త ఏయిర్ స్ట్రిప్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. 12.33 కోట్ల మంది రైతులకు సమ్మాన్ నిధి కింద రూ.3 లక్షల కోట్లు అందించామని వెల్లడించారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Hardeep Singh Puri: రాహుల్ గాంధీది “పాకిస్తాన్ జాతిపిత” మనస్తత్వం.. కేంద్రమంత్రి ఫైర్..
మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతోందని, ఈ సందర్భంగా దేశం కోసం రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. వారణాసి, బాగ్డోగ్రా, బీహార్ విమానాశ్రయాలలో కొత్త ఎయిర్స్ట్రిప్లు నిర్మించబడ్డాయని, బెంగళూర్ మెట్రోని విస్తరించినట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధర పెంచామని, యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మద్దతు ధరతో పంటల్ని కొనుగోలు చేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో కోటి ఇళ్లు నిర్మించాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో 12 పారిశ్రామిక మండలాలు ఏర్పాటు చేయడంతో పాటు ముద్రా రుణాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. యువతకు నేరుగా ప్రయోజనం చేకూర్చే 2 లక్షల కోట్ల రూపాయల ప్రధానమంత్రి ప్యాకేజీని ప్రకటించాం. దీంతో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా ఇళ్లకు సౌరశక్తి అందుతోంది.. పీఎం ఈ-బస్ సర్వీస్ ప్రారంభమైందని, స్టార్టప్స్పై 31 శాతం అనవసర పన్ను తొలగించామని చెప్పారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!