Karnataka Politics: సిద్ధరామయ్య, డీకే శివకుమారే కాదు.. సీఎం పోస్టుకు పెరుగుతున్న పోటీ..
Karnataka Politics: కర్ణాటక సీఎం పదవి వ్యవహారం ఢిల్లీకి చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించినా.. సీఎం అభ్యర్థి ఎవరనేది తేలడం లేదు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు కూడా సీఎం అభ్యర్థిత్వాన్ని కోరుకోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే సీఎం రేసులో మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తమ నేతకే సీఎం పదవి కావాలని కాంగ్రెస్ లీడర్ జీ పరమేశ్వర అనుచరులు తుమకూరులో భారీ ర్యాలీ చేపట్టారు.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలకంగా మారిన లింగాయత్ వర్గం, తమ వారికే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 34 మంది లింగాయత్ లు ఉన్నారని, తమ వారి నుంచే ముఖ్యమంత్రి ఉండాలని కోరుతూ అఖిల భారత వీరశైవ మహాసభ డిమాండ్ చేస్తోంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ కూడా రాశారు. కాంగ్రెస్ మొత్తం 46 మంది లింగాయత్ వర్గానికి చెందిన అభ్యర్థులను నిలబెడితే.. అందులో 36 మంది గెలిచారు.
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Read Also: DK Shivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే దళిత వర్గానికే ముఖ్యమంత్రి సీట్ ఇవ్వాలని, కాంగ్రెస్ సీనియర్ నేత, దళితుడైన జీ పరమేశ్వర మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. ‘దళితుడే సీఎం కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డులతో తుమకూర్ లో సభ నిర్వహించారు. బీజేపీకి కీలక మద్దతుదారులుగా ఉన్న లింగాయత్ లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇదే కాంగ్రెెస్ ఘన విజయానికి కారణం అయింది. కర్ణాటకలో 17 శాతం ఉన్న లింగాయత్ లు ఏకంగా 100 సీట్లలో ఫలితాన్ని శాసించగలరు.
బీజేపీలో లింగాయత్ వర్గానికి చెందిన నేత, మాజీ సీఎం యడియూరప్పను సైడ్ చేయడం, మరో లింగాయత్ నేత జగదీష్ షెట్టర్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీ విజయావకాశాలను దెబ్బతీశాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుత కాంగ్రెస్ లో సీఎం పోటీకి వినబడుతున్న పేర్లలో డీకే శివకుమార్ వొక్కలిగ వర్గానికి చెందగా.. సిద్దరామయ్య కురబ సామాజిక వర్గానికి చెందిన వారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!