Karnataka Politics: సిద్ధరామయ్య, డీకే శివకుమారే కాదు.. సీఎం పోస్టుకు పెరుగుతున్న పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Politics: కర్ణాటక సీఎం పదవి వ్యవహారం ఢిల్లీకి చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించినా.. సీఎం అభ్యర్థి ఎవరనేది తేలడం లేదు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు కూడా సీఎం అభ్యర్థిత్వాన్ని కోరుకోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే సీఎం రేసులో మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తమ నేతకే సీఎం పదవి కావాలని కాంగ్రెస్ లీడర్ జీ పరమేశ్వర అనుచరులు తుమకూరులో భారీ ర్యాలీ చేపట్టారు.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలకంగా మారిన లింగాయత్ వర్గం, తమ వారికే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 34 మంది లింగాయత్ లు ఉన్నారని, తమ వారి నుంచే ముఖ్యమంత్రి ఉండాలని కోరుతూ అఖిల భారత వీరశైవ మహాసభ డిమాండ్ చేస్తోంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ కూడా రాశారు. కాంగ్రెస్ మొత్తం 46 మంది లింగాయత్ వర్గానికి చెందిన అభ్యర్థులను నిలబెడితే.. అందులో 36 మంది గెలిచారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
Read Also: DK Shivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే దళిత వర్గానికే ముఖ్యమంత్రి సీట్ ఇవ్వాలని, కాంగ్రెస్ సీనియర్ నేత, దళితుడైన జీ పరమేశ్వర మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. ‘దళితుడే సీఎం కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డులతో తుమకూర్ లో సభ నిర్వహించారు. బీజేపీకి కీలక మద్దతుదారులుగా ఉన్న లింగాయత్ లు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇదే కాంగ్రెెస్ ఘన విజయానికి కారణం అయింది. కర్ణాటకలో 17 శాతం ఉన్న లింగాయత్ లు ఏకంగా 100 సీట్లలో ఫలితాన్ని శాసించగలరు.
బీజేపీలో లింగాయత్ వర్గానికి చెందిన నేత, మాజీ సీఎం యడియూరప్పను సైడ్ చేయడం, మరో లింగాయత్ నేత జగదీష్ షెట్టర్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీ విజయావకాశాలను దెబ్బతీశాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుత కాంగ్రెస్ లో సీఎం పోటీకి వినబడుతున్న పేర్లలో డీకే శివకుమార్ వొక్కలిగ వర్గానికి చెందగా.. సిద్దరామయ్య కురబ సామాజిక వర్గానికి చెందిన వారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!