Centre vs AAP: ఆప్కు మద్దతుగా ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో సీఎం నితీష్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre vs AAP: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కార్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ‘పవర్ వార్’ కొనసాగుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో అధికారాలు ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉండాలని కీలక తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారుల బదిలీలపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అధికారాలకు కత్తెర వేస్తూ.. కొత్తగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది.
కేంద్రం ఈ ఆర్డినెన్స్ ద్వారా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇది ఢిల్లీ ప్రభుత్వంలోని ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. దీంట్లో ముఖ్యమంత్రి చైర్ పర్సన్ గా, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోం సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. మెజారిటీ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్ లో ఫలితం తేలకుంటే.. లెఫ్టినెంట్ గవర్నర్ దే తుది నిర్ణయంగా ఉంటుంది.
Also Read
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
- ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
Read Also: Congress: ఇక తెలంగాణ, మధ్యప్రదేశ్పై కాంగ్రెస్ నజర్.. మే 24న మీటింగ్..
ఇదిలా ఉంటే ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆప్, సీఎం కేజ్రీవాల్ కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ ఈ రోజు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఆయనకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో ఉన్నారు నితీష్ కుమార్. ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రతిపక్షాలను కూడగట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ చట్టంగా మారకుండా ఉండేందుకు.. రాజ్యసభలో బిల్లును అడ్డుకోవాలని అనుకుంటున్నారు. ఈ బిల్లు రాజ్యసభలో పాస్ కాకపోతే.. 2024 ఎన్నికల ముందు బీజేపీ ఓడిపోయినట్లు చెప్పొచ్చని, మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదని చెప్పొచ్చని నితీష్ అన్నారు.
సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి పని చేసే హక్కును ఇచ్చింది, మీరు దానిని ఎలా తీసివేయగలరు? అని ప్రశ్నించారు. వీలైనన్ని ఎక్కువ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నామని నితీష్ చెప్పారు. చట్టబద్ధమైన పాలనను అనుసరించాలని, ప్రజల మధ్య సామరస్య ఉండాలని, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, ఇది తప్పని నితీస్ అన్నారు. సోమవారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తున్నట్లు నితీష్ చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ చర్య ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని తేజస్వి యాదవ్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అలా జరగనివ్వబోమని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Fahadh Faasil: ‘పుష్ప 2’ తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్ప్రైజ్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్తో భారీ హైప్
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!