Ayodhya Deepotsav: ‘‘ అద్భుతం.. మరుపురానిది’’.. అయోధ్య దీపోత్సవంపై ప్రధాని ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Deepotsav: దీపావళి వేడుకల్లో భాగంగా అయోధ్యలో జరిగిన ‘దీపోత్సవం’ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒకేసారి 22 లక్షల దీపాలను వెలిగించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో జరిగిన దీపోత్సవాన్ని ‘అద్భుతమైనది, దైవికమైనది, మరుపురానిది’గా ఆదివారం కొనియాడారు. ఈ వేడులకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
ప్రధాని తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో.. ‘‘అయోధ్యలో వెలిగించిన మిలియన్ల దీపాలతో దేశం మొత్తం ప్రకాశవంతంగా ఉందని అన్నారు. దీని నుంచి వెలువడే శక్తి భారతదేశమంతటా కొత్త ఉత్సాహాన్ని వ్యాపింపజేస్తోంది. శ్రీరాముడు దేశ ప్రజలందరికీ మేలు చేయాలని, నా కుటుంబ సభ్యులందరికీ స్పూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. జై సియారాం’’ హిందీలో ట్వీట్ చేశారు.
Also Read
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ జీరో
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..

Read Also: Diwali Safety Tips: దీపావళి రోజున పటాసులు పేల్చేటప్పుడు ఈ తప్పులు చేయకండి..
అయోధ్యలో శనివారం ఘనంగా ‘దీపోత్సవం’ వేడుక జరిగింది. లక్షల మట్టి దీపాలను వెలిగించారు. అంతకుముందు అయోధ్య పేరిట ఉన్న తన రికార్డును తానే బద్ధలు కొట్టింది. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న 51 ఘాట్లలో 22.23 లక్షల దీపాలను వెలిగించి కొత్తగా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయోధ్యలో దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ సంవత్సరం సుమారు 51,000 దీపాలను వెలిగించారు. 2019లో వాటి సంఖ్య 4.10 లక్షలకు చేరింది. 2020లో 6 లక్షలు , 2021లో 9 లక్షల దీపాలను వెలిగించారు. 2022లో రామ్ కి పూరీ ఘాట్ లో 17 లక్షల దీపాలను వెలగించి గిన్నస్ బుక్ ఆఫ్ రికార్డ్ సృష్టించింది.
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ఈ దీపోత్సవం ప్రత్యేకంగా నిలిచింది. వచ్చే ఏడాది జనవరిలో భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. జనవరి 22, 2024లో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పండగలా జరగబోతోంది. దీనికి ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు.
अद्भुत, अलौकिक और अविस्मरणीय!
लाखों दीयों से जगमग अयोध्या नगरी के भव्य दीपोत्सव से सारा देश प्रकाशमान हो रहा है। इससे निकली ऊर्जा संपूर्ण भारतवर्ष में नई उमंग और नए उत्साह का संचार कर रही है। मेरी कामना है कि भगवान श्री राम समस्त देशवासियों का कल्याण करें और मेरे सभी… pic.twitter.com/3dehLH45Tp
— Narendra Modi (@narendramodi) November 12, 2023
తాజావార్తలు
-
Vayu Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
-
IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్కు ఓటమి తప్పదా?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!