Ayodhya Deepotsav: ‘‘ అద్భుతం.. మరుపురానిది’’.. అయోధ్య దీపోత్సవంపై ప్రధాని ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Deepotsav: దీపావళి వేడుకల్లో భాగంగా అయోధ్యలో జరిగిన ‘దీపోత్సవం’ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒకేసారి 22 లక్షల దీపాలను వెలిగించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో జరిగిన దీపోత్సవాన్ని ‘అద్భుతమైనది, దైవికమైనది, మరుపురానిది’గా ఆదివారం కొనియాడారు. ఈ వేడులకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
ప్రధాని తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో.. ‘‘అయోధ్యలో వెలిగించిన మిలియన్ల దీపాలతో దేశం మొత్తం ప్రకాశవంతంగా ఉందని అన్నారు. దీని నుంచి వెలువడే శక్తి భారతదేశమంతటా కొత్త ఉత్సాహాన్ని వ్యాపింపజేస్తోంది. శ్రీరాముడు దేశ ప్రజలందరికీ మేలు చేయాలని, నా కుటుంబ సభ్యులందరికీ స్పూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. జై సియారాం’’ హిందీలో ట్వీట్ చేశారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!

Read Also: Diwali Safety Tips: దీపావళి రోజున పటాసులు పేల్చేటప్పుడు ఈ తప్పులు చేయకండి..
అయోధ్యలో శనివారం ఘనంగా ‘దీపోత్సవం’ వేడుక జరిగింది. లక్షల మట్టి దీపాలను వెలిగించారు. అంతకుముందు అయోధ్య పేరిట ఉన్న తన రికార్డును తానే బద్ధలు కొట్టింది. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న 51 ఘాట్లలో 22.23 లక్షల దీపాలను వెలిగించి కొత్తగా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయోధ్యలో దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ సంవత్సరం సుమారు 51,000 దీపాలను వెలిగించారు. 2019లో వాటి సంఖ్య 4.10 లక్షలకు చేరింది. 2020లో 6 లక్షలు , 2021లో 9 లక్షల దీపాలను వెలిగించారు. 2022లో రామ్ కి పూరీ ఘాట్ లో 17 లక్షల దీపాలను వెలగించి గిన్నస్ బుక్ ఆఫ్ రికార్డ్ సృష్టించింది.
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ఈ దీపోత్సవం ప్రత్యేకంగా నిలిచింది. వచ్చే ఏడాది జనవరిలో భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. జనవరి 22, 2024లో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పండగలా జరగబోతోంది. దీనికి ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు.
अद्भुत, अलौकिक और अविस्मरणीय!
लाखों दीयों से जगमग अयोध्या नगरी के भव्य दीपोत्सव से सारा देश प्रकाशमान हो रहा है। इससे निकली ऊर्जा संपूर्ण भारतवर्ष में नई उमंग और नए उत्साह का संचार कर रही है। मेरी कामना है कि भगवान श्री राम समस्त देशवासियों का कल्याण करें और मेरे सभी… pic.twitter.com/3dehLH45Tp
— Narendra Modi (@narendramodi) November 12, 2023
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!